News August 21, 2025

ఎమ్మెల్యే దగ్గుపాటికి సీఎం హెచ్చరిక

image

AP: ఇటీవల వరుస వివాదాల్లో చిక్కుకున్న అనంతపురం(U) MLA దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ CM చంద్రబాబుని కలిశారు. తన దృష్టికి వచ్చిన ఫిర్యాదులపై MLA నుంచి CM వివరణ తీసుకున్నారు. పద్ధతి మార్చుకోవాలని, ప్రజలను ఇబ్బంది పెట్టకుండా సమస్యలు పరిష్కరించాలని సూచించారు. TDPలో క్రమశిక్షణ తప్పితే చర్యలు తప్పవని హెచ్చరించారు. అటు <<17432318>>NTRను <<>>తాను దూషించలేదని, ఈ అంశంలో తనను ఇరికించారని MLA సంజాయిషీ ఇచ్చినట్లు సమాచారం.

Similar News

News March 28, 2026

నేటి నుంచే IPL సమరం

image

వేసవిలో వినోదాన్ని పంచేందుకు IPL సిద్ధమైంది. నేటి నుంచి రెండు నెలల పాటు అన్‌లిమిటెడ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వనుంది. మొత్తం 10 జట్లు 74 మ్యాచులు ఆడనున్నాయి. నేడు జరిగే తొలిపోరులో SRH, RCB తలపడనున్నాయి. ఈ రెండు జట్ల మధ్య 26 మ్యాచులు జరగ్గా SRH 14, RCB 11 గెలిచాయి. ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు. భారీ హిట్టర్లతో కూడిన ఆరెంజ్ ఆర్మీ ఇవాళ ఎలాంటి విధ్వంసం సృష్టిస్తుందో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

News March 28, 2026

కోచింగ్ సెంటర్లకు కొత్త రూల్స్.. రోజుకు 5 గంటలే

image

AP: కోచింగ్ సెంటర్ల నిర్వహణకు ఉన్నత విద్యాశాఖ కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ప్రతి సంస్థ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఆదివారం సెలవు ఇవ్వాలి. రోజుకు 5 గంటలే నడపాలి. అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఇంటర్నల్‌గా ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేయాలి. ఫీజుల కోసం వేధించొద్దు. భవనం రూల్స్‌కు అనుగుణంగా ఉండాలి. వీటిని ఉల్లంఘిస్తే ₹లక్ష వరకు ఫైన్ ఉంటుంది. అయినా రిపీట్ అయితే రిజిస్ట్రేషన్ రద్దవుతుంది.

News March 28, 2026

వృద్ధ తల్లిదండ్రులకు భరోసా.. నేడు అసెంబ్లీలో బిల్లు

image

TG: ప్రభుత్వ ఉద్యోగుల వృద్ధ తల్లిదండ్రుల రక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం నేడు అసెంబ్లీలో ‘TEAMPS’ బిల్లును ప్రవేశపెట్టనుంది. అమ్మానాన్నలను నిర్లక్ష్యం చేసే ఉద్యోగుల శాలరీ నుంచి 15% లేదా ₹10 వేల వరకు కోత విధించి వారికి అందించడమే దీని లక్ష్యం. మంత్రి లక్ష్మణ్‌ దీన్ని సభలో ప్రవేశపెట్టనున్నారు. దీంతో పాటు మంత్రి సీతక్క ‘పంచాయతీరాజ్ బిల్లు-2026’, Dy.CM భట్టి 2025-26 సవరణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.