News August 21, 2025
2025-26 ధాన్యం సేకరణకు ముందస్తు కార్యాచరణ

2025-26 సంవత్సరానికి గాను ధాన్యం సేకరణకు ముందస్తు కార్యచరణ రూపొందించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి అన్నారు. గురువారం జిల్లా కలెక్టరేట్లోని ఆయన కార్యాలయంలో ఆయా శాఖల అధికారులతో రెవెన్యూ అదనపు కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ధాన్యం కొనుగోలుకి సరిపడా గన్ని బ్యాగులు, మిల్లింగ్ సామర్థ్యం స్టోరేజ్ స్పేస్ ముందుగా ఏర్పాటు చేసుకొని ఇలా కార్యచరణ రూపొందించాలని అన్నారు.
Similar News
News August 24, 2025
MBNR: ర్యాగింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: ఎస్పీ

విద్యాసంస్థల్లో ర్యాగింగ్కు పాల్పడే విద్యార్థులపై కఠినమైన క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ఎస్పీ డి.జానకి హెచ్చరించారు. ర్యాగింగ్లో పాల్గొనే విద్యార్థులను కళాశాల నుంచి తక్షణమే బహిష్కరిస్తారని, వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, భవిష్యత్తులో ఉద్యోగావకాశాలు లేకుండా చేస్తారని తెలిపారు. ర్యాగింగ్ అనేది విద్యార్థుల భవిష్యత్తును మాత్రమే కాదు, సమాజంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అన్నారు.
News August 24, 2025
MBNR: వినాయక చవితికి పటిష్ఠ భద్రత ఏర్పాట్లు

వినాయక చవితి వేడుకలను పురస్కరించుకొని మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టినట్లు ఎస్పీ జానకి అన్నారు. వినాయక చవితి వేడుకలను పరిష్కరించుకుని జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీసు అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. వివాదాస్పద ప్రాంతాలలో దారికి అడ్డంగా మండపాలు ఏర్పాటు చేయకూడదన్నారు. అత్యవసర సేవలకు ఇబ్బందులు లేకుండా మండపాలు ఏర్పాటు చేయాలన్నారు.
News August 24, 2025
నానో యూరియాపై రైతులకు అవగాహన కల్పించండి- కలెక్టర్

నానో యూరియా వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలని మహబూబ్నగర్ కలెక్టర్ విజయేంద్ర బోయి అన్నారు. శనివారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో అధికారులతో కలెక్టర్ సమస్య నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. రైతులకు ఇబ్బందులు లేకుండా సక్రమంగా యూరియా సరఫరా అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు.