News August 21, 2025

శ్రీశైలం పవిత్రతను దెబ్బతీసే కుట్రలు: రాజాసింగ్

image

శ్రీశైలంలో దాదాపు అన్ని దుకాణాలను ముస్లింలు, క్రిస్టియన్స్ ఆక్రమించారని TG MLA రాజాసింగ్ ఆరోపించారు. ‘శ్రీశైలం పుణ్యక్షేత్రం పవిత్రతను దెబ్బతీయడానికి ఎప్పట్నుంచో కుట్రలు జరుగుతున్నాయి. గత ప్రభుత్వం ఓట్ బ్యాంక్ కోసం ముస్లింలు, క్రైస్తవులను అక్కడ స్థిరపరిచింది. ఈ విషయం CM చంద్రబాబు, పవన్‌కు తెలీదా? ఎందుకు వారిని తొలగించట్లేదు? అలాంటి వారిని వెంటనే సున్నిపెంటకు తరలించాలి’ అని విజ్ఞప్తి చేశారు.

Similar News

News March 11, 2026

BREAKING: IPL తొలి మ్యాచ్ ఎవరి మధ్య అంటే?

image

క్రికెట్ అభిమానులకు శుభవార్త. IPL-2026 తొలి మ్యాచ్ వివరాలు వెల్లడయ్యాయి. ఈ నెల 28న తొలి మ్యాచ్ జరగనుంది. బెంగళూరులో రా.7.30 గంటలకు జరిగే ఈ పోరులో రాయల్ ఛాలెంజర్స్, సన్ రైజర్స్ తలపడనున్నట్లు IPL ట్వీట్ చేసింది. మరికాసేపట్లో తొలి దశ షెడ్యూల్ రానుంది.

News March 11, 2026

అంతరిక్షంలో అంతా నిశ్శబ్దమే

image

అంతరిక్షం ఒక నిశ్శబ్ద సామ్రాజ్యం. భూమిపై గాలి ఉండటం వల్ల శబ్ద తరంగాలు ప్రయాణిస్తాయి. కానీ అంతరిక్షంలో గాలి, నీరు వంటి మాధ్యమాలు లేకపోవడంతో అక్కడ పెద్ద పేలుడు జరిగినా అది మనకు అస్సలు వినిపించదు. అక్కడ భారీ గ్రహశకలాలు ఢీకొన్నా, నక్షత్రాలు పేలిపోయినా ఎటువంటి శబ్దమూ రాదు. వ్యోమగాములు పక్కపక్కనే ఉన్నా రేడియో తరంగాలు లేకుండా మాట్లాడుకోలేరు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో- వంద వింతలు’లో..

News March 11, 2026

ఆ మందులతో లివర్ డ్యామేజీ: అధ్యయనం

image

ఆయుర్వేదం, ఇతర ప్రత్యామ్నాయ మందుల వాడకంపై తాజా అధ్యయనం షాకింగ్ విషయాలను వెల్లడించింది. 386 రకాల ఉత్పత్తులను పరీక్షించగా 27.7% మందుల్లో స్టెరాయిడ్స్, 31.3% ఉత్పత్తుల్లో జంతు సంబంధిత వ్యర్థాలు ఉన్నట్లు ఇందులో తేలినట్లు ‘ఫ్రాంటియర్స్ ఇన్ గ్యాస్ట్రోఎంటరాలజీ’ ప్రచురించింది. వీటిలో సీసం, ఆర్సెనిక్ వంటి భార లోహాలు మోతాదుకు మించి ఉన్నాయని, వీటివల్ల 39% మందిలో కాలేయం పాడై మరణ ముప్పు పెరుగుతుందని తెలిపింది.