News August 21, 2025
NLG: హర్పాల్ సింగ్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

ఎస్ఎల్బీసీ సొరంగ మార్గాన్ని పూర్తి చేయడానికి ఇరిగేషన్ శాఖ సలహాదారుడిగా మాజీ లెఫ్ట్నెంట్ జనరల్ హర్పాల్ సింగ్ను నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. డిఫెన్స్ ఇంజినీరింగ్ విభాగంలో 40 ఏళ్ల అనుభం కలిగిన ఆయన రెండేళ్లపాటు పదవిలో కొనసాగుతారు. ఎలాంటి జీతభత్యాలు తీసుకోకుండా ఆయన సేవలందిస్తారు. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ అభ్యర్థన మేరకు తెలంగాణలో పనిచేయడానికి ఆయన అంగీకరించారు.
Similar News
News March 13, 2026
అమరావతి అగ్నిప్రమాదంపై విచారణకు సీఎం ఆదేశం

అమరావతి ప్రాంతంలోని మందడం దగ్గర జరిగిన భారీ మంటల ఘటనపై CM చంద్రబాబు నాయుడు విచారణకు ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ల సమావేశంలోని టీ సమయంలో ఉన్నతాధికారులతో ఈ అంశాన్ని చర్చించారు. ఇది యాదృచ్ఛికంగా జరిగిందా లేక ఇతర కారణాలున్నాయా అనే కోణంలో పరిశీలించాలని సూచించారు. నిర్మాణ పనులకు ఉపయోగించే సామగ్రి నిల్వ ఉన్న ప్రదేశంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో జరిగిన నష్టం, పరిస్థితులపై పూర్తి వివరాలు ఇవ్వాలన్నారు.
News March 13, 2026
నేడు విశాఖ రానున్న డిప్యూటీ సీఎం పవన్

డిప్యూటీ సీఎం పవన్ నేడు విశాఖ రానున్నారు. సాయంత్రం 6 గంటలకు విశాఖ ఎయిర్ పోర్ట్కు చేరుకుని అక్కడి నుంచి రాడిసన్ బ్లూ హోటల్కు వెళ్తారు. రాత్రికి అక్కడే బస చేసి రేపు ఉదయం హెలికాప్టర్ ద్వారా అల్లూరి జిల్లాకి బయలుదేరుతారు. నందిగరువులో మాటామంతి కార్యక్రమంలో పాల్గొని తిరిగి రేపు మధ్యాహ్నం 2.15 గంటలకు అక్కడి నుంచి విశాఖ ఎయిర్ పోర్ట్కు చేరుకుంటారు. ఇక్కడి నుంచి బేగంపేటకు తిరుగు పయనమవుతారు.
News March 13, 2026
KNR: బండి సంజయ్ ‘అంజన్న ఆశీర్వాద యాత్ర’కు సవాళ్లు!

కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈనెల 14న చేపట్టనున్న ‘అంజన్న ఆశీర్వాద యాత్ర’లో భాగంగా KNR నుంచి కొండగట్టు వరకు సాగే 40 కి.మీ పాదయాత్రపై భానుడి ప్రతాపం, ట్రాఫిక్ చిక్కుల ప్రభావం చూపనున్నట్లు తెలుస్తోంది. ఆరోజు 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించడం, అదే రోజు పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానుండటంతో ట్రాఫిక్ ఆంక్షలు సవాలుగా మారనున్నాయి. దీంతో యాత్ర సాగే తీరుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.


