News April 1, 2024
ప్రముఖ నటిపై కేసు నమోదు

‘రఘువరన్ బీటెక్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి శరణ్య పొన్వన్నన్. తన ఫ్యామిలీతో చెన్నై సమీపంలోని విరుగంబాక్కంలో ఉంటున్న ఆమెపై తాజాగా ఓ కేసు నమోదైంది. పొరుగింటి మహిళతో శరణ్యకు పార్కింగ్ విషయంలో గొడవ జరిగి కొట్టుకునేవరకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈక్రమంలోనే ఆమె సదరు మహిళను చంపేస్తానంటూ బెదిరించారట. దీంతో శరణ్యపై పొరుగింటి మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేశారు.
Similar News
News February 8, 2026
వాలంటైన్స్ డే.. భారీగా హోటల్ రూమ్ బుకింగ్స్

‘వాలంటైన్స్ డే’ అంటే ఒకప్పుడు పార్కులు, రెస్టారెంట్లలో సందడి నెలకొనేది. ఇప్పుడు ప్రేమజంటలు హోటల్ స్టేలకు మొగ్గు చూపుతున్నాయి. ఈ feb14కు గతేడాదితో పోలిస్తే హోటల్ బుకింగ్స్ 175% పెరిగాయని ట్రావెల్ సంస్థలు అంటున్నాయి. గువాహటి, కొలంబో, ఆగ్రా, జైపూర్, గోవా, మనాలి తదితర ప్రాంతాలకు డిమాండ్ అధికమని వెల్లడించింది. స్టేతో పాటు ప్రైవేట్ పార్టీలు, లంచ్-డిన్నర్ తదితర ఎక్స్పీరియన్స్ ప్రిఫర్ చేస్తున్నారట.
News February 8, 2026
BPNSIలో రూ. లక్షన్నర జీతంతో ఉద్యోగాలు

<
News February 8, 2026
దేవుడు ఒక్కడేనా?

దైవం ఒక్కడే. కానీ ఆయన రూపాలు, నామాలు వేరు. మన స్వార్థం కోసం లాభనష్టాలను బేరీజు వేసుకుంటూ ఒక దైవాన్ని పూజిస్తూ, మరో దైవాన్ని కించపరచడం మహా దోషం. భూమి సారవంతమైతే ఏ విత్తనమైనా మొలకెత్తినట్లే, మన హృదయం పవిత్రంగా ఉంటే ఏ నామంతో పిలిచినా భగవంతుడు పలుకుతాడు. విలువలతో కూడిన జీవితం, పరోపకార భావన, సంపూర్ణ విశ్వాసమే దైవకృపకు అసలైన మార్గాలని పండితులు ప్రబోధిస్తున్నారు.


