News August 21, 2025

ఏపీఎం టెర్మినల్స్ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం

image

AP: పోర్టుల అభివృద్ధి, సౌకర్యాలపై APM టెర్మినల్స్ సంస్థతో CM చంద్రబాబు సమక్షంలో ఏపీ మారిటైం బోర్డు ఒప్పందం చేసుకుంది. రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టుల్లో ₹9వేల కోట్లతో టెర్మినల్స్, కార్గో హ్యాండ్లింగ్ వ్యవస్థలను ఈ సంస్థ ఏర్పాటు చేయనుంది. దీని వల్ల దాదాపు 10,000 మందికి ఉపాధి లభించనుంది. APని తూర్పు దేశాలకు సముద్ర ద్వారంగా, లాజిస్టిక్స్ హబ్‌గా మార్చడానికి కట్టుబడినట్లు CM పేర్కొన్నారు.

Similar News

News March 18, 2026

శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు.. వేల సంఖ్యలో తరలివస్తున్న కన్నడిగులు

image

AP: ఉగాది మహోత్సవాల సందర్భంగా శ్రీశైలానికి కన్నడ భక్తులు పోటెత్తుతున్నారు. నల్లమల అడవుల్లో వందలాది కి.మీ నడుచుకుంటూ క్షేత్రానికి చేరుకుంటున్నారు. మహారాష్ట్ర నుంచీ భక్తులు వస్తుండటం విశేషం. వీరంతా కళ్యాణ కట్టలో తలనీలాలు సమర్పించి పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి మల్లన్న మొక్కులు తీర్చుకుంటున్నారు. 3 రోజుల్లోనే 2 లక్షల మంది స్వామిని దర్శించుకోవడం గమనార్హం. ఉత్సవాలు ఎల్లుండితో ముగియనున్నాయి.

News March 18, 2026

ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రిని చంపేశాం: ఇజ్రాయెల్

image

ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రి ఇస్మాయిల్ ఖాతిబ్‌ను హతమార్చినట్లు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ ప్రకటించారు. టెహ్రాన్‌పై అర్ధరాత్రి జరిపిన ఎయిర్ స్ట్రైక్‌లో అతడు చనిపోయినట్లు వెల్లడించారు. ప్రధాని నెతన్యాహు ఆదేశాలతో ఇరాన్‌పై దాడులను ఉద్ధృతం చేశామని పేర్కొన్నారు. కాగా వరుసగా టాప్ లీడర్లు మరణిస్తున్నా తాము వెనక్కి తగ్గేదే లేదని ఇరాన్ స్పష్టం చేసింది.

News March 18, 2026

IPL: ఈసారి ‘క్యాప్’ పెట్టుకునేదెవరో?

image

సీజన్‌లో అత్యధిక రన్స్, వికెట్లు తీసిన ప్లేయర్లకు ఆరెంజ్, పర్పుల్ క్యాప్‌లు ఇస్తారు. గత 5 సీజన్లలో ఒక్కసారి(బ్యాటింగ్ విభాగంలో) మినహా అన్నీ ఇండియన్సే దక్కించుకున్నారు. 2021లో రుతురాజ్(635 రన్స్), హర్షల్ పటేల్(32 వికెట్లు), 2022లో బట్లర్(863), చాహల్(27), 2023లో గిల్(890), షమీ(28), 2024లో కోహ్లీ(741), హర్షల్(24), 2025లో సుదర్శన్(759), ప్రసిద్ధ్(25) గెలిచారు. ఈ సారి ఎవరిని వరిస్తాయనుకుంటున్నారు?