News August 21, 2025
ఎన్టీఆర్ జిల్లా టుడే టాప్ న్యూస్

☞ మైలవరంలో తల్లిని హత్య చేసిన కొడుకు.
☞ విస్సన్నపేటలో కుక్కల దాడిలో వ్యక్తికి గాయాలు.
☞ విజయవాడ గోల్డ్ చోరీ కేసులో పనిమనిషి అరెస్ట్.
☞ తిరువూరులో 456 పెన్షన్లు తొలగింపు: నల్లగట్ల.
☞ అంతర్రాష్ట్ర బస్సులకు “స్త్రీశక్తి” పథకం వర్తింపచేయాలి: సీపీఎం.
☞ జి.కొండూరులో మహిళా స్వీపర్ మిస్సింగ్.
☞ గణేష్ నవరాత్రి ఉత్సవాలకు అనుమతి తప్పనిసరి.
Similar News
News March 18, 2026
బాపట్లలో అభివృద్ధి ప్రాజెక్టులపై కలెక్టర్ సమీక్ష

జిల్లాలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల పార్కుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని కలెక్టర్ డా.వినోద్ కుమార్ ఆదేశించారు. బాపట్ల కలెక్టరేట్లో బుధవారం ఆయన అధికారులతో సమీక్షించారు. నిజాంపట్నం, వేటపాలెం, అమృతలూరు, పర్చూరు, బాపట్ల మండలాల్లో పార్కులు ఏర్పాటు చేయాలన్నారు. భూముల కేటాయింపు, ఒప్పందాలు త్వరగా పూర్తి చేయాలన్నారు. సూర్యలంక అభివృద్ధికి అటవీ చట్టాల ప్రకారం అనుమతులు పొందాలని సూచించారు.
News March 18, 2026
‘భూ భారతి’లో 4వేల దరఖాస్తులు రామచంద్రాపురానివే..!

రేవంత్ రెడ్డి సర్కారు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘భూ భారతి’పోర్టల్కు జిల్లాలో వచ్చిన మొత్తం దరఖాస్తుల్లో 4వేల అప్లికేషన్లు రామచంద్రాపురానివే. మంత్రి సీతక్క చొరవతో కలెక్టర్ దివాకర 10,500 ఎకరాలకు శాశ్వతంగా హద్దులు నిర్ణయించి పట్టాలు ఇచ్చేందుకు రీ సర్వేకు పూనుకున్నారు. గతంలో 1974-75, 1982, 1992, 2008లో కూడా సర్వేలు జరిగినా సత్ఫలితం రాలేదు. ఇప్పుడైనా పరిష్కారం వస్తుందని రైతులు భావిస్తున్నారు.
News March 18, 2026
PHOTOS: ‘దివ్యాంగ శక్తి’ ప్రారంభోత్సవం

AP: RTC బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ ప్రభుత్వం నేడు ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని ప్రారంభించింది. CM చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేశ్ మంగళగిరి బస్టాండ్ నుంచి దివ్యాంగులతో కలిసి 11 కి.మీ. బస్సులో ప్రయాణించారు. వారి బాగోగులు, సమస్యలు, సంక్షేమ పథకాలపై ఆరా తీశారు. అంతకుముందు సీఎం తన నివాసంలో దివ్యాంగులకు విందు ఇచ్చారు. ఆ కార్యక్రమ ఫొటోలను పైన గ్యాలరీలో చూడొచ్చు.


