News August 21, 2025

సిద్దిపేట: ‘పశువుల సంరక్షణకు జాగ్రత్తలు పాటించాలి’

image

పశువుల సంరక్షణకు శాఖాపరమైన అన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ కె. హైమావతి అన్నారు. గురువారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో పశువుల మేత కొరత లేకుండా చూడాలని, ఎప్పటికప్పుడు పశువిజ్ఞాన సదస్సులను నిర్వహించాలని సూచించారు.

Similar News

News March 17, 2026

కేయూ పరీక్ష వాయిదా.. ఏప్రిల్‌ 4కు మార్పు

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఎం.ఎస్సీ ఇంటిగ్రేటెడ్‌ కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ పరీక్ష వాయిదా పడింది. మార్చి 18న జరగాల్సిన ఈ పరీక్షను ఏప్రిల్‌ 4కి మార్చినట్లు పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య రాజేందర్ కట్ల తెలిపారు. మిగిలిన అన్ని పరీక్షలు ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారమే యథావిధిగా జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థులు ఈ మార్పును గమనించాలని సూచించారు.

News March 17, 2026

రాష్ట్రానికి అదనంగా 24వేల మెట్రిక్ టన్నుల LPG.. ఆందోళన వద్దు: CM

image

AP: ప్రస్తుతం 15 రోజులకు సరిపడా LPG నిల్వలు ఉన్నాయని, అదనంగా 24 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ వచ్చిందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. గ్యాస్ సిలెండర్ల డెలివరీ సమయాన్ని 1.5 రోజులకు కుదించాలని అధికారులను ఆదేశించారు. ఆస్పత్రులు, హాస్టళ్లు, దేవాలయాలకు ఎలాంటి కొరతా లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. పైప్డ్ గ్యాస్ నెట్‌వర్క్ పెంచేలా కార్యాచరణ రూపొందించాలన్నారు.

News March 17, 2026

మంచిర్యాల: బూత్ స్థాయి ఏజెంట్లను నియమించాలి: కలెక్టర్

image

పారదర్శకమైన ఓటర్ జాబితా రూపకల్పన కోసం రాజకీయ పార్టీలు బూత్ స్థాయి ఏజెంట్లను (BLAs) నియమించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కోరారు. మంగళవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మంచిర్యాల జిల్లాలో త్వరలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ప్రారంభం కానుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా పార్టీలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.