News August 21, 2025
కమిటీల్లో అనకాపల్లి జిల్లా ఎమ్మెల్యేలకు చోటు

విశాఖలో ఈనెల 30న జరిగే జనసేన పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి జనసేన పార్టీ కమిటీలను ఏర్పాటు చేసింది. పలు కమిటీల్లో అనకాపల్లి జిల్లాకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలకు చోటు లభించింది. పబ్లిసిటీ కమిటీలో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబును నియమించారు. మీడియా కోఆర్డినేషన్ కమిటీలో అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, ఆతిథ్యం కమిటీలో ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ నియమితులయ్యారు.
Similar News
News March 17, 2026
NLG: రైతులకు అలర్ట్.. రాబోయే రెండు రోజులు వర్షాలు!

ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. రాబోయే రెండు రోజుల పాటు జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 8 మైళ్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉన్నందున, రైతులు తమ పంట ఉత్పత్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. అకాల వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
News March 17, 2026
నిర్దోషిగా బయటకు వస్తా: ఏలూరు MP

హైదరాబాద్లో డ్రగ్స్ సంబంధిత వ్యవహారంలో తన పేరు రావడంపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్లు ఏలూరు MP పుట్టా మహేశ్ కుమార్ పేర్కొన్నారు. తాను ఎటువంటి తప్పు చేయలేదనే విషయాన్ని, ఎంపీగా గెలిపించిన ప్రజలకు, పార్టీ అధిష్ఠానానికి తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. ‘విచారణలో నేను నిర్దోషిగా బయటకు వస్తా’ అని పేర్కొన్నారు.
News March 17, 2026
PPM: ‘అటవీ ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు ఆటంకాలు ఉండరాదు’

జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో పెండింగ్లో ఉన్న రహదారులు, భవన నిర్మాణ పనులకు సంబంధించి అటవీ శాఖ అభ్యంతరాలను నిబంధనల ప్రకారం వెంటనే పరిష్కరించి, పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ ఛాంబరులో అటవీ, ఇంజినీరింగ్ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.


