News August 22, 2025
సూర్యాపేట: ‘పహాణీలో పేరు మార్పుపై కేసు నమోదు’

గరిడేపల్లి మండలంలో పహాణీలో పట్టాదారు పేరు మార్చిన ఘటనపై సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తీవ్రంగా స్పందించారు. ఈ విషయంపై ఇది వరకే చర్యలు తీసుకోవాలని ఆదేశించడమే కాక, తప్పు చేసిన వారిపై పోలీస్ కేసు నమోదు చేయాలని అధికారులను ఆదేశించామని కలెక్టర్ తెలిపారు. తహశీల్దార్ కార్యాలయంలో ఎవరి ప్రమేయంతో ఈ తప్పు జరిగిందో విచారణ చేయాలని ఆదేశించినట్లు చెప్పారు.
Similar News
News August 22, 2025
నంద్యాల: రక్తంతో చిరంజీవి చిత్రం

నందికొట్కూరుకు చెందిన ప్రముఖ చిత్రకారుడు శ్రీనివాసులు రక్తంతో చిరంజీవి చిత్రాన్ని గీశారు. ఆయన మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవి 70వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భాన్ని పురస్కరించు చిత్రాన్ని గీశానని తెలిపారు. సినీ పరిశ్రమలో చిరంజీవిగా ప్రాణం ఖరీదు సినిమాతో ప్రారంభించారని తెలిపారు. విశ్వంభర చిత్రం చేస్తూ డాన్సులు, ఫైట్లతో నటనలో నైపుణ్యం ప్రదర్శిస్తున్నారని పేర్కొన్నారు.
News August 22, 2025
బీపీఈడీ నాలుగో సెమిస్టర్ ఫలితాలు విడుదల

శ్రీకృష్ణ యూనివర్సిటీ అనుబంధ కళాశాలల బీపీఈడీ నాలుగో సెమిస్టర్ ఫలితాలను పరీక్షల విభాగంలో డైరెక్టర్ జీవి రమణ, కంట్రోలర్ శ్రీరామ్ నాయక్, అసిస్టెంట్ రిజిస్టార్ శంకర్, ప్రోగ్రామ్ ఆఫీసర్ బాలాజీ నాయక్ గురువారం ప్రకటించారు. మొత్తం 70 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా.. 60 మంది ఉత్తీర్ణత సాధించారని వారు తెలిపారు. ఫలితాల కోసం ఎస్కేయూ వెబ్సైట్ను చూడాలన్నారు.
News August 22, 2025
నాగవంశీపై ట్రోల్స్.. ఆర్జీవీ రియాక్షన్ ఇదే

ప్రముఖ నిర్మాత నాగవంశీపై సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్పై దర్శకుడు ఆర్జీవీ స్పందించారు. ‘నాగవంశీ ఓ దయగల ప్రొడ్యూసర్. ట్రోల్స్ ఆయనను ఎప్పటికీ కిందకు లాగలేవు. పది రెట్ల వేగంతో ఆయన ఆకాశమంత ఎత్తుకు ఎదుగుతారు’ అంటూ పేర్కొన్నారు. కాగా ‘కింగ్డమ్’, ‘వార్2’ సినిమాల వల్ల నాగవంశీకి భారీ నష్టాలు వచ్చినట్లు ప్రచారం జరగడంతో నెటిజన్లు అతడిపై ట్రోల్స్కు దిగుతున్న విషయం తెలిసిందే.