News August 22, 2025
కామారెడ్డి: ఏటీసీ కోర్సులపై అవగాహన కల్పించాలి: కలెక్టర్

కామారెడ్డి జిల్లాలోని 3 అడ్వాన్స్డ్ టెక్నాలజీ కేంద్రాల్లో(ఏటీసీ) కోర్సులకు అధిక సంఖ్యలో ప్రవేశాలు జరిగేలా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. గ్రామాలు, మండలాలవారీగా అర్హులైన యువత జాబితాను సేకరించి, ఏటీసీ కేంద్రాల్లోని అత్యాధునిక కోర్సుల గురించి వివరించాలన్నారు. ఏటీసీ కేంద్రాల్లో యువత చేరేలా చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి మురళీని ఆదేశించారు.
Similar News
News March 15, 2026
వరంగల్: పల్లెలకు నిధుల జల్లు

గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసింది. వరంగల్ జిల్లాకు రూ.14.93, హనుమకొండకు 13.65, భూపాలపల్లికి 4.65, జనగామకు 6.03, మహబూబాబాద్కు 9.30, ములుగు జిల్లాకు 17.13 కోట్ల చొప్పున నిధులు కేటాయించారు. కాగా అత్యధికంగా ములుగు జిల్లాకు, తక్కువగా భూపాలపల్లి జిల్లాకు కేటాయించారు. ఈ నిధులతో గ్రామాల్లో పెండింగ్లోని నిర్మాణాత్మక పనులను పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు.
News March 15, 2026
శ్రీశైలంలో రేపటి నుంచి ఉగాది ఉత్సవాలు

జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో సోమవారం నుంచి ఉగాది ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈనెల 20వ తేదీ వరకు నిర్వహించే ఈ ఉత్సవాల్లో సోమవారం ఉదయం 9 గంటలకు స్వామివారి యాగశాల ప్రవేశం, చండీశ్వర పూజా కార్యక్రమాలతో ఉత్సవాలను ప్రారంభిస్తారు. ముఖ్యంగా అమ్మవారికి అలంకరణలు, స్వామి, అమ్మవార్ల వాహన సేవలు, 18న వీరాచారా విన్యాసాలు, 19న పంచాంగ శ్రవణం, రథోత్సవం, 20న పూర్ణాహుతి తదితర కార్యక్రమాలను నిర్వహిస్తారు.
News March 15, 2026
ఏలూరు ఎంపీకి డ్రగ్స్ పాజిటివ్: ఎస్పీ

TG: మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ యాదవ్కు పాజిటివ్ వచ్చినట్లు ‘ఈగల్’ ఎస్పీ గిరిధర్ వెల్లడించారు. నిన్న యూరిన్ టెస్టు చేయగా <<19386182>>నెగటివ్<<>> వచ్చిందని, ఈరోజు టెస్టు చేయగా కొకైన్ పాజిటివ్ వచ్చిందని తెలిపారు. ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా డ్రగ్స్ తీసుకుంటే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. FIRలో మొత్తం 11 మంది పేర్లను చేర్చారు.


