News August 22, 2025

ATCతో యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు: కలెక్టర్

image

ATC సెంటర్లు యువత నైపుణ్యాభివృద్ధికి ఒక మైలురాయిగా నిలుస్తాయని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. బూర్గంపాడు మండలం కృష్ణసాగర్ ఐటీఐలో ఏర్పాటు చేసిన ATCను కలెక్టర్ సందర్శించారు. ఇక్కడి ఆధునిక పరికరాలు, ల్యాబొరేటరీలు, వర్క్‌షాప్ విభాగాలు, తరగతి గదులు పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి అందుతున్న శిక్షణ, సదుపాయాల గురించి తెలుసుకున్నారు. ఈ కేంద్రం యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని అన్నారు.

Similar News

News March 14, 2026

భూపాలపల్లిలో 3,544 మంది టెన్త్ విద్యార్థులు

image

కాసేపట్లో పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇందుకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 20 పరీక్షా కేంద్రాల్లో 3,544 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఇందులో 1,843 మంది బాలికలు, 1,701 మంది బాలురు ఉన్నారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్ష సమయం కాగా, విద్యార్థులు గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు

News March 14, 2026

ఏప్రిల్ 1 నుంచి ఫాస్టాగ్ పాసుల ధర పెంపు

image

ఫాస్టాగ్ వార్షిక పాసుల ధరలను పెంచుతున్నట్లు NHAI ప్రకటించింది. ప్రస్తుతం రూ.3వేలు ఉండగా ఏప్రిల్ 1 నుంచి రూ.3,075 వసూలు చేయనున్నట్లు తెలిపింది. కార్లు, జీపులు, వ్యాన్ల లాంటి ప్రైవేట్ నాన్ కమర్షియల్ వాహనాలకు ఈ పాస్ వర్తిస్తుంది. ఏడాది కాలం లేదా 200 ట్రిప్పులకు (ఏది ముందుగా వస్తే అది) ఈ వార్షిక పాస్ వినియోగించుకోవచ్చు.

News March 14, 2026

భూపాలపల్లి MLA పీఏ అరెస్టు

image

భూపాలపల్లి MLA గండ్ర సత్యనారాయణ రావు పీఏ శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్టు చేశారు. చిట్యాల మండలానికి చెందిన దళిత యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలిని కాదని, ఓ మహిళా SIని వివాహం చేసుకునేందుకు శ్రీనివాస్ సిద్ధమయ్యాడని పేర్కొంది. ఈ మేరకు అతడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.