News August 22, 2025

చిరంజీవికి మెగాస్టార్‌ బిరుదు ఎలా వచ్చిందంటే?

image

1988లో వచ్చిన మరణమృదంగం సినిమా ముందు వరకూ చిరంజీవిని సుప్రీం హీరో అని పిలిచేవారు. ఈ సినిమా తర్వాత చిరంజీవికి నిర్మాత కేఎస్ రామారావు మెగాస్టార్ అనే బిరుదు ఇచ్చారు. ఇక అప్పటి నుంచి టైటిల్ కార్డ్స్‌లో చిరంజీవి పేరు ముందు మెగాస్టార్ అని పడుతోంది. ఆ తర్వాత నాగబాబును మెగా బ్రదర్, రామ్ చరణ్‌ను మెగా పవర్ స్టార్, వరుణ్ తేజ్‌ను మెగా ప్రిన్స్, నిహారికను మెగా డాటర్ అని అభిమానులు ముద్దుగా పిలుచుకుంటున్నారు.

Similar News

News August 22, 2025

ప్రతి అడుగూ ముఖ్యమే.. నడవండి బాస్!

image

రోజుకు 10 వేల అడుగులు వేయడం ఎంతో మంచిదని వైద్యులు చెబుతుంటారు. అయితే అదనంగా వేసే 1000 అడుగులు చాలా ముఖ్యమని తాజా అధ్యయనంలో వెల్లడైంది. హైబీపీ ఉన్నవారు ఎక్కువగా నడవడం వల్ల గుండె వైఫల్యం (22%), స్ట్రోక్(24%), గుండె సమస్యలు(17%) వంటివి గణనీయంగా తగ్గుతాయని తేలింది. నిశ్చలంగా ఉండకుండా నడవడం చాలా మంచిదని, రోజుకు 2,500-4,000 అడుగులు వేసినా మరణ ప్రమాదం తగ్గుతుందని పేర్కొంది. SHARE IT

News August 22, 2025

రూ.300 కోట్ల దిశగా ‘మహావతార్ నరసింహ’

image

హోంబలే ఫిల్మ్స్ తెరకెక్కించిన ‘మహావతార్ నరసింహ’ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విడుదలైన 5వ వారంలోనూ థియేటర్లలో దూసుకెళ్తోంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.278 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు నిర్మాణ సంస్థ ట్వీట్ చేసింది. కాగా ఈ మూవీ గత నెల 25న ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై సంచలనాలు సృష్టిస్తోంది. దేశంలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన యానిమేషన్ చిత్రంగా నిలిచింది.

News August 22, 2025

సుదర్శన్ రెడ్డి నక్సలిజాన్ని ప్రోత్సహించారు.. షా తీవ్ర ఆరోపణలు

image

‘INDI’ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి నక్సలిజాన్ని ప్రోత్సహించారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర ఆరోపణలు చేశారు. గతంలో ఆయన ‘సల్వాజుడుం’కు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వకపోయుంటే 2020కి ముందే నక్సలిజం అంతమయ్యేదని కొచ్చిలో జరిగిన ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. వామపక్షాల ఒత్తిడితోనే కాంగ్రెస్ ఆయనను అభ్యర్థిగా ప్రకటించిందని విమర్శించారు.