News August 22, 2025

EPFOలో 230 ఉద్యోగాలు.. నేడే లాస్ట్ డేట్

image

EPFOలో 230 ఉద్యోగాల దరఖాస్తుకు ఇవాళే చివరి తేదీ. ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అభ్యర్థులు ఏదైనా డిగ్రీ పాసై ఉండాలి. వయసు 35 ఏళ్లలోపు ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు ఢిల్లీలో రెండేళ్ల ప్రొబేషన్ ఉంటుంది. లెవెల్-8, లెవెల్-10 వేతన శ్రేణి కింద జీతాలు అందుతాయి. <>https://upsconline.nic.in <<>>సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Similar News

News August 22, 2025

వైద్యశాఖలో 1,623 ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

TG: రాష్ట్రంలో 1,623 స్పెషలిస్ట్‌ డాక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోని హాస్పిటల్స్‌లో 1616, ఆర్టీసీ ఆస్పత్రుల్లో 7 పోస్టులను భర్తీ చేయనున్నారు. సెప్టెంబర్ 8వ తేదీ నుంచి 22వ తేదీ వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు. ఇక్కడ <>క్లిక్<<>> చేసి నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోవచ్చు. ఆరోగ్యశాఖలో ఇప్పటికే సుమారు 8 వేల పోస్టులను భర్తీ చేశామని ప్రభుత్వం వెల్లడించింది. SHARE IT.

News August 22, 2025

సంచలనం.. చరిత్ర సృష్టించిన క్రికెటర్

image

వన్డేల్లో ఆడిన తొలి 4 మ్యాచ్‌ల్లో 50+ స్కోరు చేసిన ఏకైక క్రికెటర్‌గా సౌతాఫ్రికా ప్లేయర్ మాథ్యూ బ్రీట్జ్కే నిలిచారు. AUSతో జరుగుతున్న 2వ వన్డేలో 78 బంతుల్లో 88 రన్స్ చేసి ఈ ఘనత అందుకున్నారు. గతంలో భారత మాజీ ప్లేయర్ నవజ్యోత్ సింగ్ 5 వన్డేల్లో(3వ ODIలో బ్యాటింగ్ ఛాన్స్ రాలేదు) ఈ ఘనత సాధించారు. మాథ్యూ 4 వన్డేల్లో NZపై 150, PAKపై 83, AUSపై తొలి వన్డేలో 57, 2వ వన్డేలో 88 రన్స్‌తో రికార్డులకెక్కారు.

News August 22, 2025

లైసెన్స్ లేని కేబుళ్లన్నీ తీసేయండి: హైకోర్టు

image

TG: హైదరాబాద్‌లో కేబుళ్ల తొలగింపు నేపథ్యంలో ఎయిర్‌టెల్ వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ భీమపాక కీలక ఆదేశాలు జారీ చేశారు. లైసెన్స్ తీసుకున్న కేబుళ్లు తప్ప ఏవీ ఉంచవద్దని స్పష్టం చేశారు. ఇష్టానుసారంగా కేబుళ్లు ఏర్పాటు చేయడం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటమేనన్నారు. కాగా ఇటీవల Dy.CM భట్టి ఆదేశాలతో HYDలో కేబుల్, ఇంటర్నెట్ వైర్లు కట్ చేసిన విషయం తెలిసిందే.