News August 22, 2025

ఖమ్మం: పేరెంట్స్ మందలించారని యువకుడు SUICIDE

image

ఇంటర్ పరీక్షలు ఫెయిల్ అయ్యాడని తల్లిదండ్రులు మందలించడంతో ఓ యువకుడు పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చింతకాని మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలిలా.. సీతంపేట గ్రామానికి చెందిన నారపోగు భరత్(19) ఇంటర్ పరీక్షలు ఫెయిల్ అయ్యాడని తల్లిదండ్రులు మందలించడంతో ఈనెల 17న పురుగు మందు తాగగా, వెంటనే కుటుంబ సభ్యుల ఆసుపత్రికి తరలించగా గురువారం చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Similar News

News March 22, 2026

సిద్దిపేట: ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు

image

సిద్దిపేట రమాదేవి ఆసుపత్రిలో ఓ మహిళ ముగ్గురు మగ శిశువులకు జన్మనిచ్చింది. ఖాదర్‌పురాకు చెందిన ఖాలిద్ బిన్ సవుద్ దంపతులకు ముగ్గురు పిల్లలు పుట్టారు. శిశువులు వరుసగా 3 కేజీలు, 2.5 కేజీలు, 2 కేజీల బరువుతో జన్మించారని, ప్రస్తుతం తల్లితో పాటు ముగ్గురు పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారని కుటుంబీకులు తెలిపారు.

News March 22, 2026

ఆదిలాబాద్‌: గడప దాటితే నీటి యుద్ధమే

image

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో తాగునీటి సమస్య కేవలం ఒక వార్తాంశం కాదు. జిల్లాలోని చాలా ప్రాంతాల్లో అక్కడి ప్రజల ప్రతిరోజూ సాగే కన్నీటి పోరాటం. ఎండ వేడిమి పెరిగే కొద్దీ, చిన్నారుల నుంచి వృద్ధుల వరకు నీటి చుక్క కోసం పడే ఆరాటం వర్ణనాతీతం. మారుమూల గ్రామాల్లో గడప దాటగానే మొదలయ్యే నీటి వేట, వారి కష్టాలను ప్రతిబింబిస్తోంది. దీంతో ఎండాకాలంలో నీటి సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటే మేలు.

News March 22, 2026

అనకాపల్లి : సీఎం చంద్రబాబు సభకు 400 బస్సులు

image

ముఖ్యమంత్రి చంద్రబాబు ఈనెల 23న ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన అనంతరం నిర్వహించే బహిరంగ సభకు జిల్లాలో అన్ని గ్రామాల నుంచి ప్రజలను తరలించేందుకు 400 బస్సులను కేటాయించారు. ఒక్కొక్క బస్సులో 60 మందిని తరలిస్తామని అధికారులు పేర్కొన్నారు. వీరందరికి బస్సు ఎక్కేముందు ఫుడ్ ప్యాకెట్స్ అందిస్తామన్నారు. తిరిగి ప్రయాణంలో కూడా ఫుడ్ సరఫరా చేస్తామన్నారు. బస్సులు సోమవారం ఉదయం 11 గంటలకు బయలుదేరుతాయి.