News August 22, 2025

నల్గొండ: కొత్తగా బియ్యం తీసుకోబోతున్నారు..!

image

సెప్టెంబర్ 1వ తేదీ నుంచి బియ్యం పంపిణీ జరగనుంది. నల్గొండ జిల్లాలో మొదటిసారి 44,099 కుటుంబాలు బియ్యం తీసుకోబోతున్నాయి. వారికి రేషన్‌తో పాటు ప్రభుత్వ పథకాలు అందనున్నాయి. ఏళ్లనాటి కల నెరవేరుతుండడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 991 రేషన్ దుకాణాలు ఉండగా గతంలో 89.15 లక్షల క్వింటాళ్ల బియ్యం కేటాయించారు. అది ఈసారి 94.04 లక్షల క్వింటాలుగా ఉండనుంది.

Similar News

News August 22, 2025

NLG: భారీ నష్టం.. పరిహారం లేకుంటే కష్టమే..!

image

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నల్గొండ జిల్లాలోని పలు మండలాల్లో రైతులను నష్టం జరిగింది. శాలిగౌరారం, కట్టంగూర్, నకిరేకల్, నార్కట్ పల్లి, చిట్యాల మండలాల్లోని పలు గ్రామాల్లో పంటలు నీట మునిగిపోయాయి. మరోవైపు రోడ్లు, కల్వర్టులు కోతకు గురవడంతో అటు రైతులు, ఇటు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి పంట నష్టపోయిన తమకు పరిహారం అందించాలని లేకుంటే కోలుకోవడం కష్టమే అంటున్నారు.

News August 22, 2025

నల్గొండలో ‘మిషన్ RRR’ ప్రారంభం

image

నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా, ‘మిషన్ RRR (Road Safety, Rules, Responsibilities)’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం కింద జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు భద్రతపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. ప్రజలు, వాహనదారులు, విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

News August 22, 2025

NLG: విద్యాశాఖలో హాజరు శాతం మెరుగు..!

image

జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరు శాతం మెరుగైంది. ముఖ ఆధారిత హాజరు విధానం అమలుతో గైర్హాజరుకు చెక్ పడింది. గతంలో ఉపాధ్యాయులు సమయానికి పాఠశాలకు రాకపోవడం, ఏవో సాకులు చూపి డుమ్మా కొట్టేవారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 1 నుంచి టీచర్లకు ముఖ గుర్తింపు హాజరును విద్యాశాఖ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రతీ రోజు ఉదయం పాఠశాలకు రాగానే యాప్లో ఇన్, వదిలి వెళ్లే సమయంలో అవుట్ అని హాజరు నమోదు చేస్తున్నారు.