News August 22, 2025

నల్గొండ: కొత్తగా బియ్యం తీసుకోబోతున్నారు..!

image

సెప్టెంబర్ 1వ తేదీ నుంచి బియ్యం పంపిణీ జరగనుంది. నల్గొండ జిల్లాలో మొదటిసారి 44,099 కుటుంబాలు బియ్యం తీసుకోబోతున్నాయి. వారికి రేషన్‌తో పాటు ప్రభుత్వ పథకాలు అందనున్నాయి. ఏళ్లనాటి కల నెరవేరుతుండడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 991 రేషన్ దుకాణాలు ఉండగా గతంలో 89.15 లక్షల క్వింటాళ్ల బియ్యం కేటాయించారు. అది ఈసారి 94.04 లక్షల క్వింటాలుగా ఉండనుంది.

Similar News

News March 17, 2026

NLG: గ్యాస్ కొరతతో సామాన్యులకు కష్టాలు

image

నల్గొండ జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్ర సమస్యగా మారింది. ధరల పెరుగుదలతో పాటు సరఫరా లోపం కారణంగా సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. వంటగదుల్లో గ్యాస్ లేక వంట చేయడం కష్టంగా మారింది. జిల్లాలో సుమారు 6 లక్షల వినియోగదారులున్నారు. ఈ నెల 13న బుక్ చేసిన సిలిండర్లు ఇంకా అందలేదు. ఈ పరిస్థితిపై ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి సరఫరా మెరుగుపరచాలని కోరుతున్నారు.

News March 17, 2026

NLG: గ్యాస్ కొరతతో సామాన్యులకు కష్టాలు

image

నల్గొండ జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్ర సమస్యగా మారింది. ధరల పెరుగుదలతో పాటు సరఫరా లోపం కారణంగా సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. వంటగదుల్లో గ్యాస్ లేక వంట చేయడం కష్టంగా మారింది. జిల్లాలో సుమారు 6 లక్షల వినియోగదారులున్నారు. ఈ నెల 13న బుక్ చేసిన సిలిండర్లు ఇంకా అందలేదు. ఈ పరిస్థితిపై ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి సరఫరా మెరుగుపరచాలని కోరుతున్నారు.

News March 17, 2026

NLG: మొదటి విడత కంప్లీట్… రెండో విడతకు కసరత్తు

image

జిల్లాలో వ్యవసాయాన్ని మరింత ఆధునీకరించేందుకు ప్రభుత్వం రెండో విడత యాంత్రీకరణ పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సాగులో యంత్రాల వాడకాన్ని పెంచి, రైతులకు శ్రమ, పెట్టుబడి భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం ప్రభుత్వం మరో రూ.4 కోట్ల భారీ నిధులు కేటాయించనున్నది. జిల్లాలో ఇప్పటికే మొదటి విడతలో రూ.4 కోట్ల వ్యయంతో 1,900 మంది రైతులకు ప్రభుత్వం విజయవంతంగా పరికరాలను అందజేసింది.