News August 22, 2025
చిత్తూరు కలెక్టర్ పేరుతో నకిలీ ఫేస్ బుక్ అకౌంట్

కలెక్టర్ సుమిత్ కుమార్ ఐఏఎస్ పేరుతో నకిలీ ఫేస్ బుక్ అకౌంట్ను గుర్తు తెలియని వ్యక్తులు ప్రారంభించారు. ఈ విషయం కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో నిజమైన ఫేస్ బుక్ ఖాతా నుంచి అలెర్ట్ మెసేజ్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ మేరకు గురువారం కలెక్టర్ తన ఒరిజినల్ ఫేస్ బుక్ అకౌంట్ నుంచి ప్రజలకు అవగాహన కల్పించేందుకు అత్యవసర సమాచారం అంటూ మెసేజ్ను పోస్ట్ చేశారు. నకిలీ అకౌంట్తో జాగ్రత్త వహించాలని సూచించారు.
Similar News
News August 22, 2025
భూమన బెదిరింపులకు భయపడం: పూతలపట్టు ఎమ్మెల్యే

వైసీపీ నేత భూమన బెదిరింపులకు భయపడేవారు ఎవరూ లేరని పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం ఆయన మాట్లాడారు. టీటీడీని వైసీపీ తన రాజకీయ అవసరాలకు ఉపయోగించుకుంటోందని ఆరోపించారు. ఛైర్మన్ బీఆర్ నాయుడుపై భూమన చేసిన ఆరోపణలను ఖండించారు. వైసీపీ హయాంలో ఎన్నో అరాచకాలు చోటు చేసుకున్నాయని ఆయన అన్నారు.
News August 21, 2025
కాణిపాకం బ్రహ్మోత్సవాలకు ప్రముఖులకు ఆహ్వానం

కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి 2025 వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవస్థానం ఈ.వో పెంచల కిశోర్ జిల్లాలోని ప్రముఖులకు ఆహ్వాన పత్రిక అందించారు. వారిలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణాసారిక, ఎస్పీ మణికంఠ చందోలు, JC విద్యాధరి ఇతర ముఖ్య అధికారులు ఉన్నారు. వారికి ఈవో ఆహ్వాన పత్రికలు అందజేసి బ్రహ్మోత్సవాలకు రావాలంటూ కోరారు.
News August 21, 2025
ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు: చిత్తూరు SP

వినాయక మండపాల ఏర్పాటుకు అనుమతుల పొందేందుకు ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదని ఎస్పీ మణికంఠ గురువారం స్పష్టం చేశారు. మండపాల ఏర్పాటుకు సింగిల్ విండో క్లియరెన్స్ విధానం తీసుకొచ్చామన్నారు. ఆన్లైన్లో వివరాలు నమోదు చేస్తే సరిపోతుందన్నారు. మైక్ అనుమతులను మీసేవ కేంద్రాలలో పొందాలన్నారు. ప్రభుత్వ నిబంధనలు తప్పక పాటించాలని సూచించారు.