News August 22, 2025

సూర్యాపేట: ‘మార్వాడీ గో బ్యాక్’ ఉద్యమానికి మద్దతు

image

మార్వాడీ సంస్కృతికి వ్యతిరేకంగా మేళ్లచెరువులో చేపట్టిన బంద్‌కు ఎలక్ట్రిషియన్, ప్లంబర్, హార్డ్‌వేర్, సానిటేషన్ వ్యాపార సంఘాలు మద్దతు తెలిపాయి. ‘మార్వాడీ హటావో, తెలంగాణ బచావో’ నినాదంతో భారీ ర్యాలీ నిర్వహించి, ఈ ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని సంఘాల సభ్యులు ప్రకటించారు. ఈ ఉద్యమానికి స్థానికంగా మద్దతు పెరుగుతోంది.

Similar News

News August 22, 2025

HYD: సెప్టెంబరు నుంచి 100 రోజుల అక్షరాస్యత ఉద్యమం

image

సెప్టెంబరు నుంచి100 రోజులపాటు అక్షరాస్యత ఉద్యమాన్ని నిర్వహించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో ఈ ఉద్యమం ప్రారంభం కానుంది. 15 ఏళ్ల వయసు దాటిన వారి కోసం ప్రత్యేకంగా 16 పాఠాలు ముద్రించి, అక్షర వికాసం కోసం ప్రభుత్వం కృషి చేయనుందని అధికారులు తెలిపారు.

News August 22, 2025

కూకట్‌పల్లి: సహస్ర హత్య.. పోలీసుల అదుపులో బాలుడు

image

సహస్ర హత్య కేసులో పక్క భవనంలో ఉన్న బాలుడే ఈ దారుణానికి వడిగట్టినట్టు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే బాలుడిని అదుపులోకి తీసుకున్న ప్రత్యేక బృందాలు విచారణ చేపట్టారు. హత్య జరిగిన కూతవేటు దూరంలో ఉన్న పాఠశాలల్లోనే ఆ బాలుడు చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం బాలుడిని విచారణ చేయడంలో భాగంగా అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని వివరాలను విచారణ అనంతరం తెలియజేస్తామని తెలిపారు.

News August 22, 2025

ఏలూరు జిల్లాలో బీజేపీ నేతలకు కీలక పదవులు

image

ఏలూరు జిల్లాకు చెందిన ఇద్దరు బీజేపీ నేతలకు పార్టీలో కీలక పదవులు లభించాయి. ఏలూరు నగరానికి చెందిన గారపాటి సీతారామాంజనేయ చౌదరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడిగా, కొయ్యలగూడెంకు చెందిన బొల్లిన నిర్మల కిషోర్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం పార్టీ అధిష్ఠానం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి.