News April 1, 2024

టోల్ ఛార్జీల పెంపు వాయిదా

image

ఇవాళ్టి నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన టోల్ ఛార్జీల పెంపును ఎన్నికలు పూర్తయ్యే వరకు వాయిదా వేయాలని NHAIను ఈసీ ఆదేశించింది. దీంతో పాత ఛార్జీలే వసూలు చేయాలని టోల్ ఆపరేటర్లకు NHAI సూచించింది. ఇవాళ వసూలు చేసిన మొత్తాలను వాహనదారుల అకౌంట్లలో తిరిగి జమ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. కాగా నిన్న అర్ధరాత్రి నుంచి ఛార్జీలు సగటున 5 శాతం పెరిగిన విషయం తెలిసిందే.

Similar News

News March 22, 2026

ఈ నెల 25న కాంగ్రెస్‌కు గుడ్‌బై: జీవన్ రెడ్డి

image

TG: ఈ నెల 25న కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తానని మాజీ మంత్రి జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. అవమానాలు భరిస్తూ పార్టీలో ఉండలేనని తెలిపారు. కాగా నిన్న మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ గంటన్నర సేపు బుజ్జగించినా జీవన్ రెడ్డి వెనక్కి తగ్గలేదు. కాగా జీవన్ రెడ్డి జగిత్యాల నియోజకవర్గం నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తొలుత ఎన్టీఆర్ హయాంలో మంత్రిగా పని చేశారు. 40 ఏళ్లుగా కాంగ్రెస్‌లో కొనసాగుతున్నారు.

News March 22, 2026

కేవలం అభివృద్ధి పైనే దృష్టి పెడితే ఎన్నికల్లో గెలవలేం: CBN

image

1999-2004 మధ్య హైదరాబాద్‌ను శరవేగంగా అభివృద్ధి చేశామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. HYD ISBలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. అప్పట్లో తాను కృషి చేయడం వల్లే జినోమ్ వ్యాలీ వచ్చిందని గుర్తు చేశారు. అనేక కారణాల వల్ల 2004లో ఓడిపోయామని, మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు పదేళ్లు పట్టిందన్నారు. 2014-19 వరకు APలో అనేక కార్యక్రమాలు చేపట్టామని, కేవలం అభివృద్ధి పైనే దృష్టి పెడితే ఎన్నికల్లో గెలవలేమని తెలిపారు.

News March 22, 2026

ఎండల్లో కూల్ డ్రింక్స్ తాగుతున్నారా?

image

వేసవిలో శరీర చల్లదనం కోసం ఎక్కువ మంది కూల్ డ్రింక్స్ తాగుతుంటారు. అయితే ఇవి ఏమాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ‘వాటిలో చక్కెర, కెఫీన్ అధికంగా ఉంటాయి. దీంతో టైప్-2 డయాబెటిస్, ఫ్యాటీ లివర్, దంతాలు పుచ్చిపోవడం, ఆస్టియోపోరోసిస్, నిద్ర లేమి, డీహైడ్రేషన్, గుండె సమస్యలు రావొచ్చు. నిమ్మరసం, కొబ్బరి నీళ్లు, షర్బత్, మజ్జిగ, పండ్లు, కూరగాయల స్మూతీలు తీసుకోవడం మంచిది’ అని సూచిస్తున్నారు.
#ShareIt