News August 22, 2025
బాపట్ల: శ్రావణ మాసం చివరి శుక్రవారం.. పూల ధరలకు రెక్కలు

బాపట్లలోని వివిధ ప్రాంతాల్లో శ్రావణ మాసం చివరి శుక్రవారం సందర్భంగా పూల ధరలు మామూలు రేట్ల కంటే డబుల్ అయ్యాయి. నిన్నటిదాకా కిలో మల్లెపూలు రూ.500 – 600 ఉంటే, నేడు కిలో రూ.900 పెట్టి కొనుగోలు చేస్తున్నట్లు వ్యాపారులు తెలిపారు. చామంతి పూలు, చిట్టి రోజాలు కేజీ రూ. 400 -రూ.500 పలుకుతున్నాయి. మల్లెపూలు మూర రూ.50, బంతిపూలు మూర రూ.30 అమ్ముతున్నారు. మరి మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
Similar News
News August 22, 2025
సహస్ర హత్య కేసులో సంచలన విషయాలు

TG: కూకట్పల్లిలో సహస్ర మర్డర్ <<17484838>>కేసులో<<>> సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇంట్లోకి ప్రవేశించిన బాలుడు చోరీ చేసేందుకు ప్రయత్నించాడు. అది సహస్ర చూడగా వెంట తెచ్చుకున్న కత్తితో 21 సార్లు పొడిచి చంపాడు. చోరీ ఎలా చేయాలి, ఎవరైనా చూస్తే ఏం చేయాలి అని పేపర్లో ముందే రాసుకున్నాడు. స్థానికుడైన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి సమాచారంతో పోలీసులు బాలుడిని ప్రశ్నించగా విషయం బయటపడింది. లెటర్, కత్తి స్వాధీనం చేసుకున్నారు.
News August 22, 2025
Dream 11పై బ్యాన్.. BCCI ఏమందంటే?

కేంద్రం తీసుకొచ్చిన ఆన్లైన్ గేమింగ్ బిల్ నేపథ్యంలో భారత జట్టుకు స్పాన్సర్గా వ్యవహరిస్తున్న డ్రీమ్ 11పైనా బ్యాన్ పడనుంది. దీనిపై BCCI సెక్రటరీ దేవజిత్ సైకియా స్పందించారు. ‘అనుమతి లేకపోతే స్పాన్సర్ను తొలగిస్తాం. కేంద్రం తీసుకొచ్చే ఏ పాలసీనైనా తప్పకుండా అమలు చేస్తాం’ అని స్పష్టం చేశారు. దీంతో సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం అయ్యే ఆసియా కప్లో స్పాన్సర్ లేకుండానే భారత జట్టు బరిలోకి దిగే అవకాశం ఉంది.
News August 22, 2025
సరిహద్దులను గుర్తించడానికి స్వమిత్వ సర్వే: జేసీ

గ్రామాలలో నివసించే ప్రజలకు ఉన్న భూమి హక్కులను నిర్ధారించడానికి గ్రామ సరిహద్దులను గుర్తించడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రక్రియే స్వమిత్వ సర్వే అని కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి అన్నారు. ఆమె అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద శుక్రవారం ఈ సర్వే నిర్వహణపై జిల్లాలోని ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలతో సమీక్షించారు. సర్వే నిర్వహణ దశలను వారికి వివరించారు.