News August 22, 2025
కొయ్యూరు: టీఏ, కంప్యూటర్ ఆపరేటర్ సస్పెండ్

కొయ్యూరు మండలంలో ఉపాధి హామీ పథకంలో టెక్నికల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ప్రభాకర్, కంప్యూటర్ ఆపరేటర్ కుమారిని సస్పెండ్ చేశామని డ్వామా పీడీ డీవీ విద్యాసాగర్ తెలిపారు. గతంలో వారు చింతపల్లి మండలంలో విధులు నిర్వహించిన సమయంలో అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయన్నారు. దీనిపై విచారణ జరిపి చర్యలు చేపట్టామన్నారు. క్రమ శిక్షణ చర్యల్లో భాగంగా సస్పెండ్ చేసినట్లు చెప్పారు.
Similar News
News August 22, 2025
సంగారెడ్డి: 12 ఏళ్ల బాలికను హత్య చేసిన బాలుడు!

కూకట్పల్లిలో సంగారెడ్డి జిల్లాకు చెందిన సహస్ర హత్య కేసు కీలక మలుపు తిరిగింది. 5వ రోజు కేసును ఛేదించిన పోలీసులు ఓ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. సహస్ర ఇంటి పక్కనే ఉన్న భవనంలో నివసిస్తున్న 10వ తరగతి విద్యార్థి ఈ హత్య చేసినట్లు గుర్తించారు. దొంగతనానికి వెళ్లిన సమయంలో బాలికను చూసి హత్య చేసినట్లు అతడు ఒప్పుకున్నాడని పోలీసులు వెల్లడించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News August 22, 2025
పెద్దపల్లి: ‘విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా బోధన ఉండాలి’

పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష హై స్కూల్ విద్యాబోధనపై ప్రత్యేకదృష్టి సారించాలని సూచించారు. 6-9వ తరగతి విద్యార్థులకు సబ్జెక్టులను బేసిక్ స్థాయిలో, సులభంగా అర్థమయ్యే విధంగా బోధించాలని, పాఠ్యాంశాలపై కనీస పరిజ్ఞానం 80% విద్యార్థులకు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉపాధ్యాయులు ప్రతి పాఠ్యాంశానికి సంబంధించి TLM తయారీ, బోధన విధానాల మెరుగుదల సూచనలపై జిల్లా విద్యాశాఖ పూర్తి సహకారం అందిస్తుందన్నారు.
News August 22, 2025
నెల్లూరు వ్యవసాయ ప్రయోగశాలకు జాతీయ స్థాయి గుర్తింపు

నెల్లూరు ఆర్డీవో కార్యాలయ ప్రాంగణంలో ఉన్న ఎరువులు, సేంద్రియ ఎరువుల నాణ్యత నిర్ధారణ ప్రయోగశాలకు జాతీయస్థాయి గుర్తింపు లభించింది. రైతులకు ఎరువుల నాణ్యత, నేల సారవంతంపై మెరుగైన సలహాలు అందిస్తున్నందుకు ఎన్ఏబీఎల్ గుర్తింపు వచ్చింది. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా నెల్లూరు అగ్రికల్చర్ ల్యాబ్కు జాతీయస్థాయి గుర్తింపు రావడంతో కలెక్టర్ ఆనంద్ వారిని అభినందించారు.