News August 22, 2025

HYD- విజయవాడకు E-గరుడలో 26% డిస్కౌంట్

image

HYD-విజయవాడ మార్గంలో ప్రయాణికులకు TGSRTC బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ మార్గంలో ఈ-గరుడ బస్సుల్లో ప్రయాణించే వారికి టికెట్ ధరపై 26% రాయితీ ప్రకటించింది. ఈ- గరుడ బస్సులు కాలుష్య రహితమైనవని, పర్యావరణహితమైనవని, 100% సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చని RTC అధికారులు తెలిపారు. ఈ మార్గంలో TGSRTC 10 ఈ-గరుడ బస్సులను నడుపుతోంది.

Similar News

News August 22, 2025

కూకట్‌పల్లి: సహస్ర హత్య.. బాలుడు రాసిన పేపర్ ఇదే!

image

సహస్ర హత్య కేసులో బాలుడికి సంబంధించి సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. ఆ ఇంట్లోకి వెళ్లే ముందు ఎలా వెళ్లాలి? ఏం చేయాలి? అనేదానిపై పూర్తిగా పేపర్ పైన రాసుకొని మరీ హత్యకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. పేపర్‌‌లో లాస్ట్‌‌ లైన్ మిషన్ కంప్లీటెడ్‌ అని రాసుకొన్న బాలుడి ఆలోచన విధానం స్థానికులను కలవరానికి గురిచేస్తోంది. పదేళ్ల బాలుడి మైండ్‌సెట్ ఇలా ఉండటం పట్ల అంతా నివ్వెరపోతున్నారు.

News August 22, 2025

కూకట్‌పల్లిలో 12 ఏళ్ల బాలికను హత్య చేసిన బాలుడు!

image

కూకట్‌పల్లిలోని సంగీత్‌నగర్‌లో బాలిక సహస్ర హత్య కేసు కీలక మలుపు తిరిగింది. 5వ రోజు కేసును ఛేదించిన పోలీసులు ఓ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. సహస్ర ఇంటి పక్కనే ఉన్న భవనంలో నివసిస్తున్న 10వ తరగతి విద్యార్థి ఈ హత్య చేసినట్లు గుర్తించారు. దొంగతనానికి వెళ్లిన సమయంలో బాలికను చూసి హత్య చేసినట్లు అతడు ఒప్పుకున్నాడని పోలీసులు వెల్లడించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News August 22, 2025

నిజాం నిరంకుశత్వాన్ని నిలదీశారు షోయబ్ ఉల్లాఖాన్

image

షోయబ్ ఉల్లాఖాన్ 1920 OCT 17న ఖమ్మం జిల్లా సుబ్రవేడులో జన్మించారు. ఆయన HYDలో ఎక్కువ రోజులు గడిపారు. ఓయూలో జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందారు. నగరంలో వెలువడే ఇమ్రోజ్ పత్రిక ద్వారా నిరంకుశ నిజాం పాలనను వ్యతిరేకిస్తూ వ్యాసాలు రాశారు. నిజాం వ్యతిరేక ప్రజాపోరాటాలను బలపర్చినందుకు కార్యాలయం నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో 1948 ఆగష్టు 22న రజాకార్లు అతిక్రూరంగా కాల్చిచంపారు. HYDలోనే ఆయన చివరి శ్వాస విడిచారు.