News August 22, 2025
విద్యార్థుల ఆరోగ్యం & విద్యాభివృద్ధికి మరో ముందడుగు: మంత్రి

విద్యార్థుల ఆరోగ్యం & విద్యాభివృద్ధి కోసం మరో ముందడుగు అని మంత్రి కొండా సురేఖ అన్నారు. సంక్షేమ వసతి గృహాల్లో మెస్ ఛార్జీలు 40%, కాస్మెటిక్ ఛార్జీలు 200% పెంచి వసతులు మెరుగుపరుస్తూ రామకృష్ణ మిషన్ & అక్షయపాత్ర సహకారంతో జిల్లాలోని 123 ప్రభుత్వ పాఠశాలల్లో పౌష్ఠికాహార మధ్యాహ్న భోజన కార్యక్రమం ప్రారంభమైంది. కరీమాబాద్ బీరన్నకుంట పాఠశాలలో విద్యార్థులకు మంత్రి భోజనం వడ్డించారు. కలెక్టర్, మేయర్ ఉన్నారు.
Similar News
News August 22, 2025
వరంగల్: మౌలిక వసతుల పనులు పూర్తి చేయాలి: కలెక్టర్

జిల్లాలోని 10 జూనియర్ కళాశాలల మౌలిక వసతుల పనులను దసరా లోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశించారు. ‘అమ్మ ఆదర్శ పాఠశాలల అభివృద్ధి’పై సమీక్షలో ఆమె మాట్లాడారు. ఈ పనుల కోసం ప్రభుత్వం రూ.1.36 కోట్లు కేటాయించిందని తెలిపారు. పనులను సకాలంలో పూర్తి చేయాలని ప్రిన్సిపాల్స్, కమిటీ ఛైర్మన్లను ఆదేశించారు.
News August 22, 2025
రేపటి నుంచి ప్రభుత్వ జూ.కళాశాలల్లో ముఖ గుర్తింపు హాజరు

ఇంటర్మీడియట్ ప్రభుత్వ జూ.కళాశాలల్లో ఈనెల 23 నుంచి ముఖ గుర్తింపు హాజరు(ఫేస్ రికగ్నెషన్ సిస్టమ్) హజరు పద్దతి అమలు చేయనున్నట్లు DIEO డా.శ్రీధర్ సుమన్ తెలిపారు. ఈరోజు ఇంటర్ విద్య కార్యాలయంలో ప్రిన్సిపళ్లకు, సంబంధిత ఇన్ఛార్జ్లకు నూతన హాజరు విధానంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి టీజీబీఐఈ-ఎఫ్ ఆర్ఎస్ యాప్ ఇన్స్టాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకొని రోజువారీ హాజరు నమోదు చేయాలన్నారు.
News August 21, 2025
డ్రగ్ సంబంధిత సమాచారం ఇవ్వండి: వరంగల్ సీపీ

డ్రగ్స్ సంబంధిత సమాచారం ఇవ్వడానికి 1908కు కాల్ చేయాలని సీపీ సన్ ప్రీత్ సింగ్ ప్రజలను కోరారు. ఎవరి వద్దనైనా డ్రగ్స్ వ్యాపారం, వాడకం లేదా అనుమానాస్పద సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. సమాచారం ఇచ్చే వారి వ్యక్తిగత వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు. డ్రగ్స్ సమాజాన్ని నాశనం చేస్తాయన్నారు.