News August 22, 2025

EV కార్ల బ్యాటరీలపై అపోహలు-నిజాలు!

image

EV కారు బ్యాటరీపై ప్రజల్లో నెలొకన్న సందేహాలను Deloitte 2025 రిపోర్ట్ నివృత్తి చేస్తోంది. ఆ నివేదిక ప్రకారం.. EV కారు కొన్న మూడేళ్లకే లక్షలు పెట్టి బ్యాటరీ మార్చనక్కర్లేదు. వాటికి కనీసం 10-20 ఏళ్ల లైఫ్ ఉంటుంది. TATA మోటార్స్ లైఫ్ టైమ్, OLA 8ఏళ్లు వారంటీ ఇస్తున్నాయి. టెస్లా డేటా ప్రకారం 2లక్షల కి.మీ. డ్రైవ్ చేసినా బ్యాటరీ కెపాసిటీ 80% ఉంటుంది. EV కార్ల ధరలు కూడా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.

Similar News

News March 21, 2026

US మినహాయింపు ఇచ్చినా ఇరాన్ ఆయిల్ రావడం కష్టమే?

image

చమురు కొరత నేపథ్యంలో ఇరాన్ ఆయిల్‌పై ఆంక్షలను అమెరికా ఎత్తివేసింది. ఈ క్రూడ్ కొనడానికి భారతీయ కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. అయితే ఇరాన్ తమ వద్ద సర్‌ప్లస్ ఆయిల్ లేదని షాక్ ఇచ్చింది. హార్ముజ్‌ను బ్లాక్ చేసిన ఇరాన్ USపై మరింత ఒత్తిడి పెంచేందుకు ఇలా చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో భారత్‌కు ఇరాన్ ఆయిల్ రావడం ప్రశ్నార్థకమైంది. 2018లో US ఆంక్షలకు ముందు ఇరాన్ క్రూడ్ అతిపెద్ద బయ్యర్‌గా భారత్ ఉండేది.

News March 21, 2026

ధురంధర్-2పై టాలీవుడ్ స్టార్ల ప్రశంసలు.. ప్రకాశ్ రాజ్ కామెంట్స్ వైరల్

image

ధురంధర్-2 సినిమాపై అల్లు అర్జున్, జూ.ఎన్టీఆర్, మహేశ్ బాబు, విజయ్ దేవరకొండ సహా దక్షిణాది స్టార్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే బాలీవుడ్ స్టార్లు ఎవరూ స్పందించలేదు. ఇదే విషయంపై ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌కు ప్రకాశ్ రాజ్ ఇటీవల ఇచ్చిన సమాధానం వైరలవుతోంది. ఎవరో కోరడం వల్లే వీరు స్పందిస్తున్నారనే అర్థం వచ్చేలా ‘దక్షిణాదికి సైతం ఆబ్లిగేషన్స్ విస్తరిస్తున్నాయనడానికి ఇవి సూచనలు’ అని పేర్కొన్నారు.

News March 21, 2026

భార్యతో ఫోన్‌లో మాట్లాడుతుండగా మిస్సైల్ దాడి.. భారతీయుడు మృతి

image

సౌదీలో జరిగిన మిస్సైల్ దాడిలో ఓ భారతీయుడు మరణించాడు. యూపీకి చెందిన రవి గోపాల్ (26) రియాద్‌లోని ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. మార్చి 18న భార్యతో ఫోన్లో మాట్లాడుతుండగా ఫ్యాక్టరీ సమీపంలో భారీ పేలుడు సంభవించింది. మిస్సైల్ శకలాలు మీద పడటంతో రవి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడని బంధువులు చెప్పారు. మృతదేహాన్ని త్వరగా ఇండియాకు పంపేందుకు సౌదీలోని ఇండియన్ ఎంబసీ ప్రయత్నిస్తోంది.