News August 22, 2025

వందే భారత్ రైళ్లు ఇవే.. అసంతృప్తిగా ‘HYD- నాగపూర్’

image

సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం 20707, సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం 20834, కాచిగూడ నుంచి బెంగళూరు 20703, సికింద్రాబాద్ నుంచి తిరుపతి 20701, సికింద్రాబాద్ నుంచి నాగపూర్ 20102 వందే భారత్ రైళ్లు అందుబాటులో ఉన్నాయి. జులై నాటికి విశాఖపట్నం వెళ్లే రైళ్ల ఆక్యుపెన్సీ రేషియో గరిష్ఠంగా ఉండగా, నాగపూర్ వెళ్లే రైలు ఆక్యుపెన్సీ రేషియో అసంతృప్తిగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

Similar News

News August 22, 2025

సహస్ర హత్య కేసులో సంచలన విషయాలు

image

TG: కూకట్‌పల్లిలో సహస్ర మర్డర్ <<17484838>>కేసులో<<>> సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇంట్లోకి ప్రవేశించిన బాలుడు చోరీ చేసేందుకు ప్రయత్నించాడు. అది సహస్ర చూడగా వెంట తెచ్చుకున్న కత్తితో 21 సార్లు పొడిచి చంపాడు. చోరీ ఎలా చేయాలి, ఎవరైనా చూస్తే ఏం చేయాలి అని పేపర్‌లో ముందే రాసుకున్నాడు. స్థానికుడైన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సమాచారంతో పోలీసులు బాలుడిని ప్రశ్నించగా విషయం బయటపడింది. లెటర్, కత్తి స్వాధీనం చేసుకున్నారు.

News August 22, 2025

Dream 11పై బ్యాన్.. BCCI ఏమందంటే?

image

కేంద్రం తీసుకొచ్చిన ఆన్‌లైన్ గేమింగ్ బిల్ నేపథ్యంలో భారత జట్టుకు స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న డ్రీమ్ 11పైనా బ్యాన్ పడనుంది. దీనిపై BCCI సెక్రటరీ దేవజిత్ సైకియా స్పందించారు. ‘అనుమతి లేకపోతే స్పాన్సర్‌ను తొలగిస్తాం. కేంద్రం తీసుకొచ్చే ఏ పాలసీనైనా తప్పకుండా అమలు చేస్తాం’ అని స్పష్టం చేశారు. దీంతో సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం అయ్యే ఆసియా కప్‌లో స్పాన్సర్‌ లేకుండానే భారత జట్టు బరిలోకి దిగే అవకాశం ఉంది.

News August 22, 2025

సరిహద్దులను గుర్తించడానికి స్వమిత్వ సర్వే: జేసీ

image

గ్రామాలలో నివసించే ప్రజలకు ఉన్న భూమి హక్కులను నిర్ధారించడానికి గ్రామ సరిహద్దులను గుర్తించడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రక్రియే స్వమిత్వ సర్వే అని కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి అన్నారు. ఆమె అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద శుక్రవారం ఈ సర్వే నిర్వహణపై జిల్లాలోని ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలతో సమీక్షించారు. సర్వే నిర్వహణ దశలను వారికి వివరించారు.