News August 22, 2025
రంప: నిర్లక్ష్యంగా ఉండే ఉద్యోగులపై చర్యలు తీసుకుంటాం

ఆదికర్మయోగి అభియాన్ వర్క్ షాపు ముగింపు కార్యక్రమం రంపచోడవరం వైటీసీలో శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా ITDA. PO. సింహాచలం మాట్లాడుతూ.. ఈ పథకం విజయవంతం చేయడానికి ప్రతీ ఉద్యోగి సేవా భావంతో పని చేయాలన్నారు. విల్లేజ్ విజన్ మ్యాప్ సచివాలయం ఉద్యోగులు రూపొందించాలని ఆదేశించారు. నిర్లక్ష్యంగా ఉండే ఉద్యోగులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. MPDO విశ్వనాథ్ పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ చేశారు.
Similar News
News March 13, 2026
‘రామాయణంలో పిడకల వేట’ అంటే?

ముఖ్య విషయాన్ని వదిలేసి పనికిరాని వాటి గురించి మాట్లాడే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు. పండితులు రామాయణం చెబుతుండగా ఓ మహిళ ఇంటి దగ్గర పిడకలు ఏమయ్యాయోనని మధ్యలో అనడంతో ‘రామాయణంలో పిడకల వేట’ వాడుకలోకి వచ్చింది. అలాగే రామాయణంలో ‘త్రిపిటికా:’ అని ఉంది. బౌద్ధ గ్రంథాలనూ ‘త్రిపిటికా’ అంటారు. దీంతో బౌద్ధం తర్వాత రామాయణం వచ్చిందని వాదించే వాళ్ల గురించి చెబుతూ ఈ జాతీయం వచ్చిందని నమ్మకం.
<<-se>>#EPICSAYINGS<<>>
News March 13, 2026
వనపర్తి: ‘సాగు, తాగునీటికి ఇబ్బంది కలగనివ్వద్దు’

వనపర్తి జిల్లాలో సాగు, తాగునీటితో పాటు విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. పంటలు చేతికి వచ్చే వరకు రైతులకు ఇబ్బంది కలగనివ్వద్దన్నారు. అలాగే జిల్లాలో LPG సిలిండర్ల కొరత లేదని, ఆసుపత్రులు, పాఠశాలలకు నిరంతరం సరఫరా జరిగేలా చూడాలని స్పష్టం చేశారు.
News March 13, 2026
సీఎం ను కదిలించిన ఏలూరు కలెక్టర్

పాపికొండల అభయారణ్య పరిధిలోని గిరిజన గ్రామాల్లో బోరుబావులు, రహదారుల నిర్మాణానికి అటవీ అధికారులు అభ్యంతరం చెబుతున్నారని కలెక్టర్ల సదస్సులో కలెక్టర్ వెట్రిసెల్వి సీఎం చంద్రబాబు దృష్టికి తెచ్చారు. స్పందించిన సీఎం గిరిజనులకు కనీస వసతులు కల్పించాల్సిన అవసరం ఉందని, అటవీ అధికారులు కొంత వెసులుబాటు ఇవ్వాలని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో గిరిజనులకు మౌలిక సదుపాయాలు అందేందుకు ఎట్టకేలకు మార్గం సుగమమైంది.


