News August 22, 2025

NZB: రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ టోర్నీకి జిల్లా జట్లు

image

తెలంగాణ రాష్ట్ర స్థాయి బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలకు నిజామాబాద్ జిల్లా సీనియర్ మహిళా, పురుషుల జట్లు ఖరారయ్యాయి. ఇటీవల మహిళా, పురుషుల ప్రాబబుల్స్ జట్లకు సన్నద్ధ శిబిరం నిర్వహించారు. ఇందులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జిల్లా జట్టుకు ఎంపిక చేశారు. ఎంపికైన జిల్లా జట్లు నేటి నుంచి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా గోలేటిలో జరిగే 71వ రాష్ట్రస్థాయి టోర్నమెంట్‌లో ప్రాతినిధ్యం వహించనున్నారు.

Similar News

News August 22, 2025

నిజామాబాద్: పోలీస్ పర్సనల్ అధికారుల శిక్షణ

image

పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న వారికి PSO శిక్షణ కార్యక్రమాన్ని పోలీస్ కమాండ్ కంట్రోల్ హాల్‌లో సీపీ సాయి చైతన్య శుక్రవారం ప్రారంభించారు. సీపీ మాట్లాడుతూ.. VIPల భద్రతలో సేవలు అందించే PSOల పాత్ర అత్యంత ముఖ్యమైందన్నారు. నైపుణ్యాలను మెరుగుపరచడానికి, అత్యాధునిక విధానాలపై అవగాహన కల్పించడానికి, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలపై శిక్షణ ఇచ్చామన్నారు.

News August 22, 2025

నిజామాబాద్: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ధ్యేయం: ఎమ్మెల్యే

image

గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా పనుల జాతర కార్యక్రమాన్ని చేపట్టిందని రూరల్ ఎమ్మెల్యే డా.భూపతి రెడ్డి వెల్లడించారు. శుక్రవారం నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని పాల్ద గ్రామంలో పనుల జాతరలో రూ.12 లక్షల వ్యయంతో నూతన అంగన్‌వాడీ భవన నిర్మాణానికి శుక్రవారం కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఇతర అధికారులతో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.

News August 22, 2025

ఆర్మూర్: ‘ప్రైవేట్ పాఠశాలకు నోటీసులు జారీ చేశాం’

image

ఆర్మూర్ పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులకు జారీ చేసే ట్రాన్స్‌ఫార్మర్ సర్టిఫికెట్‌కి డబ్బులు వసూలు చేసినట్టు వచ్చిన సమాచారం మేరకు ఆ పాఠశాలకు నోటీసులు జారీ చేశామని మండల విద్యాశాఖ అధికారి రాజా గంగారం ఈరోజు తెలిపారు. ఫీజుల పెండింగ్, టీసీ విషయంలో విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తే సంబంధిత యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.