News August 22, 2025

సంగారెడ్డి: 12 ఏళ్ల బాలికను హత్య చేసిన బాలుడు!

image

కూకట్‌పల్లిలో సంగారెడ్డి జిల్లాకు చెందిన సహస్ర హత్య కేసు కీలక మలుపు తిరిగింది. 5వ రోజు కేసును ఛేదించిన పోలీసులు ఓ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. సహస్ర ఇంటి పక్కనే ఉన్న భవనంలో నివసిస్తున్న 10వ తరగతి విద్యార్థి ఈ హత్య చేసినట్లు గుర్తించారు. దొంగతనానికి వెళ్లిన సమయంలో బాలికను చూసి హత్య చేసినట్లు అతడు ఒప్పుకున్నాడని పోలీసులు వెల్లడించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News August 23, 2025

ఐతుపెల్లి : హెల్త్ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి అడ్లూరి

image

పెగడపల్లి మండలం ఐతుపెల్లి గ్రామంలో ఈరోజు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నేషనల్ హెల్త్ మిషన్ కింద రూ. 20 లక్షల వ్యయంతో నిర్మించిన హెల్త్ సెంటర్ ను అధికారులతో కలిసి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. హెల్త్ సెంటర్ ద్వారా పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య అధికారులు, స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

News August 23, 2025

MHBD: రైతులు ఎవరు కుడా ఆందోళన చెందవద్దు: DAO

image

జిల్లా రైతులకు ఇప్పటివరకు మహబూబాబాద్ జిల్లాలో 21,042 మెట్రిక్ టన్నుల యూరియాను సప్లై చేసినట్లు DAO విజయనిర్మల తెలిపారు. యూరియా సప్లై రెగ్యులర్‌గా వస్తుంది కాబట్టి ఎటువంటి ఆందోళన చెందవద్దన్నారు. గతంతో పోలిస్తే 200మెట్రిక్ టన్నుల యూరియా అదనంగా వచ్చిందన్నారు. రైతులు ఎవరూ ఆందోళన చెందవొద్దన్నారు.

News August 23, 2025

ఏంజెలినా సంచలన నిర్ణయం.. అమెరికాకు గుడ్‌బై!

image

ఒకప్పుడు అమెరికా అంటే ప్రతిఒక్కరి కలల ప్రపంచం. కానీ ఇప్పుడు కథ మారింది. USలో ఉండటం కంటే వేరే దేశాలకు వెళ్లిపోవడం బెటర్ అనుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే హాలీవుడ్ ప్రముఖులు రిచర్డ్ గెరె, ఎల్లెన్ డిజెనెరెస్, ఇవా లోంగోరియా వలస వెళ్లడానికి సిద్ధమయ్యారు. తాజాగా ఆ జాబితాలో ఏంజెలినా జోలీ కూడా చేరినట్లు సమాచారం. రాజకీయ అనిశ్చితి, పెరుగుతున్న క్రైం రేట్, ఆర్థిక భారం ఈ నిర్ణయానికి కారణాలని తెలుస్తోంది.