News August 22, 2025
సుదర్శన్ రెడ్డి నక్సలిజాన్ని ప్రోత్సహించారు.. షా తీవ్ర ఆరోపణలు

‘INDI’ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి నక్సలిజాన్ని ప్రోత్సహించారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర ఆరోపణలు చేశారు. గతంలో ఆయన ‘సల్వాజుడుం’కు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వకపోయుంటే 2020కి ముందే నక్సలిజం అంతమయ్యేదని కొచ్చిలో జరిగిన ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. వామపక్షాల ఒత్తిడితోనే కాంగ్రెస్ ఆయనను అభ్యర్థిగా ప్రకటించిందని విమర్శించారు.
Similar News
News August 23, 2025
ఘోరం: కేక్ తినిపించిన చేతులతోనే..

TG: సహస్ర హత్య కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల సహస్ర బర్త్ డే వేడుకలకూ హాజరైన బాలుడు ఆమెకు కేక్ తినిపించాడు. అదే చేతుల్తో బాలికను అత్యంత దారుణంగా హత్య చేయడం స్థానికులను షాక్కు గురిచేస్తోంది. కాగా సహస్ర ఇంట్లో <<17485132>>డబ్బులు దొంగిలించి<<>> క్రికెట్ బ్యాట్ కొనాలనుకున్నట్లు బాలుడు చెప్పినట్లు తెలుస్తోంది. క్రైమ్ వెబ్సిరీస్లు చూసే హత్య ఆలోచన వచ్చినట్లు చెప్పాడని సమాచారం.
News August 23, 2025
DSC అభ్యర్థులకు కీలక సూచనలు

AP: కాల్ లెటర్ అందిన DSC అభ్యర్థులకు కన్వీనర్ కృష్ణారెడ్డి పలు సూచనలు చేశారు. ‘ఒరిజినల్ సర్టిఫికెట్లు, కుల ధ్రువీకరణ పత్రం, గెజిటెడ్ అధికారితో ధ్రువీకరించిన 3సెట్ల సర్టిఫికెట్ల కాపీలు, 5పాస్పోర్టు సైజు ఫొటోలతో సర్టిఫికెట్ వెరిఫికేషను(CV)కు హాజరు కావాలి. ముందే వాటిని సైట్లో అప్లోడ్ చేయాలి. CVకి తప్పనిసరిగా రావాలి. హాజరుకాని లేదా అర్హత లేని అభ్యర్థుల అభ్యర్థిత్వం రద్దు చేస్తాం’ అని తెలిపారు.
News August 23, 2025
సెప్టెంబర్లో నైపుణ్య పోర్టల్ ప్రారంభం: లోకేశ్

AP: సెప్టెంబర్లో నైపుణ్య పోర్టల్ను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. దేశానికే రోల్ మోడల్గా నిలిచేలా దీన్ని తీర్చిదిద్దాలని అధికారులను ఆయన ఆదేశించారు. పీఎం ఇంటర్న్షిప్ స్కీమ్తో ఈ పోర్టల్ను అనుసంధానించాలని సూచించారు. ఏటా 50వేల మంది యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేలా దీనిని తీర్చిదిద్దుతున్నట్లు పేర్కొన్నారు.