News August 22, 2025

ఏలూరు జిల్లాలో బీజేపీ నేతలకు కీలక పదవులు

image

ఏలూరు జిల్లాకు చెందిన ఇద్దరు బీజేపీ నేతలకు పార్టీలో కీలక పదవులు లభించాయి. ఏలూరు నగరానికి చెందిన గారపాటి సీతారామాంజనేయ చౌదరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడిగా, కొయ్యలగూడెంకు చెందిన బొల్లిన నిర్మల కిషోర్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం పార్టీ అధిష్ఠానం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి.

Similar News

News August 23, 2025

DSC అభ్యర్థులకు కీలక సూచనలు

image

AP: కాల్ లెటర్‌ అందిన DSC అభ్యర్థులకు కన్వీనర్ కృష్ణారెడ్డి పలు సూచనలు చేశారు. ‘ఒరిజినల్ సర్టిఫికెట్లు, కుల ధ్రువీకరణ పత్రం, గెజిటెడ్ అధికారితో ధ్రువీకరించిన 3సెట్ల సర్టిఫికెట్ల కాపీలు, 5పాస్‌పోర్టు సైజు ఫొటోలతో సర్టిఫికెట్ వెరిఫికేషను(CV)కు హాజరు కావాలి. ముందే వాటిని సైట్‌లో అప్‌లోడ్ చేయాలి. CVకి తప్పనిసరిగా రావాలి. హాజరుకాని లేదా అర్హత లేని అభ్యర్థుల అభ్యర్థిత్వం రద్దు చేస్తాం’ అని తెలిపారు.

News August 23, 2025

సిరిసిల్ల: ‘విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసింది’

image

కేంద్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసిందని ఆర్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అంగూరు రంజిత్ అన్నారు. సిరిసిల్లలో శుక్రవారం రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. రంజిత్ మాట్లాడుతూ.. బడ్జెట్లో విద్యారంగానికి నిధులు కేటాయించకపోవడం వల్ల విద్య వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమై పేద విద్యార్థులకు అందని ద్రాక్షగా మారిందన్నారు. బీజేపీ విద్యా వ్యతిరేక విధానాలను మానుకోకపోతే మూల్యం చెల్లిస్తుందన్నారు.

News August 23, 2025

జగిత్యాల: 17 ఏళ్ల పురాతన కేసు పరిష్కారం

image

జగిత్యాల జిల్లా న్యాయస్థానంలో 17 సంవత్సరాల పురాతన సివిల్ కేసును రాజీకి సహకరించిన న్యాయవాదులను జిల్లా జడ్జి రత్న పద్మావతి అభినందించారు. ఈ సందర్భంగా వాది, ప్రతివాది న్యాయవాదులు మారిశెట్టి ప్రతాప్, మేట్ట మహేందర్, బార్ ప్రెసిడెంట్ శ్రీరాములు ప్రత్యేక చొరవ వల్లే సాధ్యమైనట్లు జడ్జి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు ఎస్ నారాయణ, వెంకట మాలిక్ శర్మ న్యాయవాదులు పాల్గొన్నారు.