News August 22, 2025

కంచికచర్ల: బోసి నవ్వులకు వందేళ్లూ నిండాయి

image

బైక్‌పై వెళుతూ తల్లి ఒడిలో కూర్చుని కనిపించే వారిని చూస్తూ బోసి నవ్వులు నవ్వుతోంది. ఆ చిరునవ్వులు చూసి తల్లి మురిసిపోతోంది. ఇంతలో విషాదం లారీ రూపంలో వచ్చింది. ఒక్కసారిగా <<17483745>>ఢీకొట్టడంతో<<>> ఆ చిన్నారి నవ్వు అనంత లోకాల్లో కలిసిపోయింది. దీంతో తల్లి నిశ్చేష్టురాలైంది. అప్పటిదాకా కళ్ల ముందు కదలాడిన తన చిట్టితల్లి ఇక లేదని తెలిసి గుండెలు బాదుకుంది. చిన్నారి విగతజీవిగా పడి ఉన్న దృశ్యం గుండెల్ని మెలిపెడుతోంది.

Similar News

News March 23, 2026

ఏప్రిల్ 3న ఓటీటీలోకి ‘సితారే జమీన్ పర్’

image

బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘సితారే జమీన్ పర్’ సినిమా ఎట్టకేలకు OTTలోకి రానుంది. ఏప్రిల్ 3 నుంచి సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. గతేడాది జూన్ 20న ఈ మూవీ రిలీజ్ కాగా రూ.260 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఆగస్టు 1 నుంచి యూట్యూబ్‌లో ‘పే పర్ వ్యూ’ పద్ధతిలో అందుబాటులోకి తెచ్చారు. రూ.100 చెల్లించి చూసే అవకాశం కల్పించారు. ఇప్పుడు OTTలోకి వస్తోంది.

News March 23, 2026

కడప: ఇవాళ్టి పరీక్షకు 27,677 మంది హాజరు!

image

కడప జిల్లాలో 167 కేంద్రాల్లో సోమవారం 10వ తరగతి గణితం పరీక్షలు జరిగాయి. నేటి పరీక్షలకు 27,861 మంది విద్యార్థులు హాజరవ్వాల్సి ఉండగా.. 27,677 మంది పరీక్షలు రాశారు. 184 మంది ఆబ్సెంట్ అయ్యారు. 7 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 45 సెంటర్లను, 70 కేంద్రాల్లో సిట్టింగ్ స్క్వాడ్లు తనిఖీ చేశారు. 31 సెంటర్లలో ఓపెన్ 10th పరీక్షలు జరిగాయి. 2,386 మంది పరీక్షలు రాయాల్సి ఉండగా.. 1,989 మంది రాశారు. 397 మంది గైర్హాజరయ్యారు.

News March 23, 2026

వనపర్తిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం: కలెక్టర్

image

వనపర్తి జిల్లాలోని ఘనపూర్ ఫోర్ట్, శ్రీ రంగనాయక స్వామి ఆలయం, సరళాసాగర్ వంటి చారిత్రక, పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. ఈ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు డీపీఆర్ సిద్ధం చేస్తే ప్రభుత్వం ద్వారా నిధులు మంజూరు చేయిస్తామని, జిల్లాను పర్యాటక హబ్‌గా మారుస్తామని ఆయన పేర్కొన్నారు.