News August 22, 2025

VZM: రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు

image

విజయనగరం జిల్లాలో ఎరువులకు కొర‌త లేద‌ని, స‌రిప‌డి నంత స్టాక్ సిద్దంగా ఉంద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ అంబేడ్కర్ తెలిపారు. రైతులు ఆందోళ‌న చెంద‌వ‌ద్ద‌ని ఆయ‌న కోరారు. శుక్రవారం తన ఛాంబర్‌లో సమీక్ష జరిపారు. ప్రస్తుతం ఉన్నవివిధ పంటలకు గాను 36,740 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా, ఇప్పటివరకు 25,605 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా జరిగిందని చెప్పారు. 3వేల టన్నుల యూరియా అవ‌స‌రం ఉంటుంద‌న్నారు.

Similar News

News August 23, 2025

VZM: స్కానింగ్ సెంట‌ర్ల‌ను త‌నిఖీ చేయండి

image

విజయనగరం జిల్లాలోని స్కానింగ్ సెంట‌ర్ల‌ను ఆక‌స్మికంగా త‌నిఖీ చేసి, నివేదిక‌ను స‌మ‌ర్పించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ అంబేడ్కర్ ఆదేశించారు. జిల్లాలో పిసిపిఎన్‌డిటి చ‌ట్టం అమ‌లుపై త‌మ ఛాంబ‌ర్‌లో వివిధ శాఖ‌ల అధికారుల‌తో శుక్ర‌వారం సమావేశాన్ని నిర్వ‌హించారు. జిల్లాలోని స్కానింగ్ సెంట‌ర్ల రెన్యువ‌ల్‌, కొత్త వాటికి అనుమ‌తుల‌పై చ‌ర్చించారు. అనుమ‌తి లేకుండా స్కానింగ్ సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేయ‌కూడ‌ద‌న్నారు.

News August 22, 2025

VZM: గుంటూరు పార్లమెంట్ పరిశీలకునిగా కిమిడి నాగార్జున

image

పార్లమెంటు అధ్యక్షుల నియామకంలో భాగంగా తనను గుంటూరు పార్లమెంట్ స్థానానికి పరిశీలకులుగా నియమించినట్లు విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున తెలియజేశారు. ఈ మేరకు శుక్రవారం ఒక పత్రిక విడుదల చేశారు. తనపై నమ్మకం పెట్టి పరిశీలకునిగా నియమించినందుకు సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి లోకేశ్‌కి ధన్యవాదాలు తెలియజేశారు. దీంతో నాగార్జునకి పలువురు అభినందనలు తెలిపారు.

News August 22, 2025

పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారానికి చర్యలు: ఎస్పీ

image

విజయనగరం జిల్లా పోలీసుశాఖలో వివిధ హోదాల్లో పని చేస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది సమస్యల పరిష్కారానికి జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పోలీసు కార్యాలయంలో శుక్రవారం “పోలీసు వెల్ఫేర్ డే” నిర్వహించారు. ఈసందర్భంగా సిబ్బంది వ్యక్తిగత, వృత్తిపరమైన, శాఖాపరమైన సమస్యలను తెలుసుకున్నారు. వారి నుంచి వినతులు స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.