News April 2, 2024

NLG: 3 నుంచి ‘ పది ‘ జవాబుపత్రాల మూల్యాంకనం

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో పదో తరగతి ప్రధాన పరీక్షలు ముగిశాయి. దీంతో జవాబు పత్రాల మూల్యాంకనానికి చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏప్రిల్ 3 నుంచి 11వ తేదీ వరకు జవాబు పత్రాల మూల్యాంకనం చేసేందుకు విద్యా శాఖ సన్నద్ధమవుతుంది. ఇందు కోసం నల్గొండ జిల్లా కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ ఉన్నత పాఠశాలలో మూల్యాంకన కేంద్రం ఏర్పాటు చేశారు. అందుకు అవసరమైన చర్యలు చేపట్టారు.

Similar News

News March 13, 2026

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం కావాలి: కలెక్టర్

image

నూతన ప్రజాప్రతినిధులు నిరంతరం గ్రామాల్లో పర్యటిస్తూ, ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా శుక్రవారం మిర్యాలగూడలో నిర్వహించిన సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వ పథకాలను పారదర్శకంగా, అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా అధికారులు పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు.

News March 13, 2026

NLG: ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు.. 13,981 మంది హ్యాపీ

image

జిల్లాలో ఇంటర్ వార్షిక పరీక్షలు శుక్రవారంతో విజయవంతంగా ముగిశాయి. ద్వితీయ సంవత్సరం కెమిస్ట్రీ, కామర్స్ పేపర్లతో ఈ పరీక్షల పర్వం దిగ్విజయంగా పూర్తి కావడంతో విద్యార్థులు, అటు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ద్వితీయ సంవత్సరం జనరల్ విభాగంలో 11,783 మంది, వొకేషనల్ విభాగంలో 2,248 మంది.. మొత్తం 13,981 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. పరీక్షల నిర్వహణలో సహకరించిన ప్రతిఒక్కరికీ డీఐఈఓ ధన్యవాదాలు తెలిపారు.

News March 13, 2026

గ్రామీణ ప్రాంతాల్లో గ్యాస్ బుకింగ్‌కు 45 రోజుల గడువు

image

వంట గ్యాస్ సరఫరాపై ఒత్తిడి తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం గ్యాస్ బుకింగ్ నిబంధనల్లో మార్పులు చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ఒక్క సిలిండర్ తర్వాత మరో సిలిండర్ బుకింగ్‌కు కనీసం 45 రోజుల గడువు ఉండాలని నిర్ణయించింది. అయితే పట్టణ ప్రాంతాల్లో ప్రస్తుతం అమల్లో ఉన్న 25 రోజుల నిబంధనే కొనసాగుతోంది. గ్యాస్ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌ను నివారించడమే లక్ష్యంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది.