News August 22, 2025
ఆర్మూర్: ‘ప్రైవేట్ పాఠశాలకు నోటీసులు జారీ చేశాం’

ఆర్మూర్ పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులకు జారీ చేసే ట్రాన్స్ఫార్మర్ సర్టిఫికెట్కి డబ్బులు వసూలు చేసినట్టు వచ్చిన సమాచారం మేరకు ఆ పాఠశాలకు నోటీసులు జారీ చేశామని మండల విద్యాశాఖ అధికారి రాజా గంగారం ఈరోజు తెలిపారు. ఫీజుల పెండింగ్, టీసీ విషయంలో విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తే సంబంధిత యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
Similar News
News August 23, 2025
రుద్రూర్లో బాలుడి అదృశ్యం

రుద్రూర్ గ్రామానికి చెందిన బాలుడు జ్యోతే కేదార్ (14) గురువారం రాత్రి నుంచి కనిపించడం లేదని తల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఎస్ఐ సాయన్న ఈరోజు తెలిపారు. స్కూల్ వెళ్లకుండా బోధన్ టౌన్కు వెళ్లినందుకు తల్లిదండ్రులు మందలించారన్నారు. రాత్రి కేదార్ ఎవరికి చెప్పకుండా ఇంట్లోంచి వెళ్లిపోయాడని. బంధువుల వద్ద గాలించినప్పటికీ ఆచూకీ లభించలేదని తల్లి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశామన్నారు.
News August 22, 2025
నిజామాబాద్: పోలీస్ పర్సనల్ అధికారుల శిక్షణ

పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న వారికి PSO శిక్షణ కార్యక్రమాన్ని పోలీస్ కమాండ్ కంట్రోల్ హాల్లో సీపీ సాయి చైతన్య శుక్రవారం ప్రారంభించారు. సీపీ మాట్లాడుతూ.. VIPల భద్రతలో సేవలు అందించే PSOల పాత్ర అత్యంత ముఖ్యమైందన్నారు. నైపుణ్యాలను మెరుగుపరచడానికి, అత్యాధునిక విధానాలపై అవగాహన కల్పించడానికి, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలపై శిక్షణ ఇచ్చామన్నారు.
News August 22, 2025
నిజామాబాద్: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ధ్యేయం: ఎమ్మెల్యే

గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా పనుల జాతర కార్యక్రమాన్ని చేపట్టిందని రూరల్ ఎమ్మెల్యే డా.భూపతి రెడ్డి వెల్లడించారు. శుక్రవారం నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని పాల్ద గ్రామంలో పనుల జాతరలో రూ.12 లక్షల వ్యయంతో నూతన అంగన్వాడీ భవన నిర్మాణానికి శుక్రవారం కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఇతర అధికారులతో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.