News August 22, 2025
FLASH: శామీర్పేట్ చెరువులో యువకుడి మృతదేహం కలకలం

శామీర్పేట్ పెద్ద చెరువులో పడి ఒక వ్యక్తి మృతిచెందిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. చెరువులో ఓ వ్యక్తి మృతదేహం ఉందని స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శవాన్ని వెలికితీశారు. మృతుడు చెరుకూరి రసూల్(25)గా గుర్తించామని తెలిపారు. మృతుడు మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీ వద్ద నివాసం ఉంటున్నట్లు చెప్పారు.
Similar News
News March 18, 2026
TODAY HEADLINES

☛ రాష్ట్రానికి అదనంగా 24వేల మెట్రిక్ టన్నుల LPG: CM CBN
☛ చంద్రబాబు తీరువల్లనే డ్రగ్స్ దందాలు: జగన్
☛ మొయినాబాద్ డ్రగ్స్ కేసుపై సిట్ ఏర్పాటు చేసిన TG ప్రభుత్వం
☛ KCR కూడా డ్రగ్ టెస్ట్కు రావాలి: TPCC చీఫ్
☛ ఆరు గ్యారంటీల ఫైల్ ఎక్కడ? కాకి ఎత్తుకెళ్లిందా?: KTR
☛ ఇంకా ఆందోళనకరంగానే గ్యాస్ నిల్వలు: కేంద్రం
☛ అఫ్గాన్పై పాక్ దాడులు.. ఖండించిన భారత్
News March 18, 2026
హాస్టల్స్లో సమస్యల పరిష్కారానికి కృషి చేయండి: కలెక్టర్

జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో సమస్యల పరిష్కారం కృషి చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం
మచిలీపట్నం కలెక్టరేట్లో హాస్టళ్ల సంయుక్త తనిఖీ కమిటీ సమావేశం నిర్వహించారు. వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలు, తాగునీరు, పారిశుద్ధ్యం, ఆరోగ్యం తదితర సమస్యలపై సమీక్షించారు. వసతి గృహాల నిర్వహణపై నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు.
News March 18, 2026
సిరిసిల్ల: లక్కీ డిప్ ద్వారా ‘రేవంతన్న కా సహారా’ లబ్ధిదారుల ఎంపిక

తెలంగాణ మైనారిటీల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘రేవంతన్నా కా సహారా – మిస్కీన్’ పథకం కింద, రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంగళవారం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తయింది. ఫఖీర్, దూదేకుల, దూదేకుల ముస్లిం కమ్యూనిటీ సభ్యులకు మోపెడ్లు, బైక్లు, ఈ-బైక్లను అందించే లక్ష్యంతో జిల్లాకు కేటాయించిన ఐదు స్థానాలకు ఐదుగురు లబ్ధిదారులను కలెక్టర్ గరిమా అగ్రవాల్ సమక్షంలో లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేశారు.


