News August 22, 2025
భారత్కు మద్దతు.. అమెరికా మాజీ NSA ఇంట్లో తనిఖీలు

INDపై ట్రంప్ టారిఫ్లను తప్పుబట్టిన US మాజీ జాతీయ భద్రతా సలహాదారు(NSA) జాన్ బోల్టన్ ఇంట్లో FBI తనిఖీలు చేపట్టింది. INDకు మద్దతు తెలిపిన మరునాడే ఇలా జరగడం గమనార్హం. తమ అధికారులు విధులు నిర్వర్తించారని, చట్టానికి ఎవరూ అతీతులు కాదని FBI డైరెక్టర్ కాష్ పటేల్ వెల్లడించారు. తనిఖీలు జరుగుతున్నా జాన్ వెనక్కి తగ్గలేదు. నోబెల్ శాంతి బహుమతి కోసం ట్రంప్ ఉక్రెయిన్-రష్యాతో భేటీలు అవుతూనే ఉంటారని విమర్శించారు.
Similar News
News August 23, 2025
EP44: ఈ విషయాల్లో సిగ్గు పడకండి: చాణక్య నీతి

కొన్ని విషయాల్లో సిగ్గు పడితే జీవితానికే నష్టమని చాణక్య నీతి చెబుతోంది. ‘డబ్బు విషయంలో సిగ్గు పడకూడదు. అప్పు ఇస్తే నిర్మొహమాటంగా అడిగి తీసుకోవాలి. బంధువులు, ఫ్రెండ్స్ ఇళ్లలో తినే విషయంలో సిగ్గు ఉండకూడదు. ఏదో అనుకుంటారని తినకుండా ఆకలి చంపుకోకూడదు. తెలియని విషయాన్ని తెలుసుకొని జ్ఞానం పొందేందుకు ఇతరులను అడిగి నేర్చుకోవాలి. అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేయాలి’ అని పేర్కొంటోంది. #<<-se>>#chanakyaneeti<<>>
News August 23, 2025
ఆ ఉద్యోగుల వయోపరిమితి పెంచుతారా?

AP: విభజన చట్టం 9, 10 షెడ్యూల్లోని ప్రభుత్వ సంస్థలు, సొసైటీలు, కార్పొరేషన్లలో పనిచేసే ఉద్యోగుల వయోపరిమితి పెంపుపై క్యాబినెట్ సబ్ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. కమిటీ సభ్యులుగా మంత్రులు లోకేశ్, నారాయణ, పయ్యావుల కేశవ్, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఉన్నారు. వయోపరిమితిని 60 నుంచి 62 ఏళ్లకు పెంచడంపై ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. సాధ్యమైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని ఈ కమిటీని ప్రభుత్వం ఆదేశించింది.
News August 23, 2025
నేడు పెద్దాపురానికి సీఎం చంద్రబాబు

AP: సీఎం చంద్రబాబు ఇవాళ కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు పెద్దాపురంలో జరిగే స్వచ్ఛతా ర్యాలీలో సీఎం పాల్గొంటారు. మ్యాజిక్ డ్రైన్లు, స్వచ్ఛతా రథాలను పరిశీలించనున్నారు. ఆ తర్వాత స్థానిక పార్టీ నేతలతో సమావేశం నిర్వహిస్తారు. అనంతరం తిరిగి ఉండవల్లి చేరుకుని సా.5.30 గంటలకు మంత్రులు, ఎమ్మెల్యేలతో భేటీ అవుతారు.