News August 22, 2025
రాయికల్: ఆర్టీసీ బస్సు ఢీకొని దివ్యాంగుడి మృతి

రాయికల్ మం. అల్లిపూర్కు చెందిన బరతాల రాజేందర్(30) అనే దివ్యాంగుడు RTC బస్సు ఢీకొని మృతిచెందినట్లు ఏఎస్ఐ దేవేందర్ శుక్రవారం తెలిపారు. గ్రామంలో గురువారం రాత్రి రాజేందర్ రోడ్డు దాటుతుండగా అతివేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో తీవ్ర గాయాలైన అతనిని మెరుగైన చికిత్స నిమిత్తం వరంగల్ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు చెప్పారు. మృతుని తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నమన్నారు.
Similar News
News March 23, 2026
హార్ముజ్లో గర్జిస్తున్న పాత యుద్ధ విమానం

అమెరికా ఎయిర్ ఫోర్స్ రిటైర్ చేయాలనుకున్న పాత యుద్ధ విమానం ‘A-10 థండర్బోల్ట్’ (Warthog) ఇప్పుడు హార్ముజ్ జలసంధిలో ఇరాన్ స్పీడ్ బోట్లను వేటాడటంలో కీలకంగా మారింది. నిమిషానికి 3,900 రౌండ్లు కాల్చే దీని పవర్ఫుల్ గన్ శత్రువులకు వణుకు పుట్టిస్తోంది. ఆధునిక F-35 విమానాలు ఖరీదైనవి కావడంతో తక్కువ ఎత్తులో ఎగురుతూ దాడులను తట్టుకోగల ఈ ‘ఫ్లయింగ్ ట్యాంక్’ సామర్థ్యం ఇప్పుడు అమెరికాకు వరంగా మారింది.
News March 23, 2026
వెదురుకుప్పం: జల్లికట్టులో విషాదం.. 3 ఎద్దులు మృతి

వెదురుకుప్పం మండలంలో జరిగిన జల్లికట్టులో విషాదం చోటుచేసుకుంది. మూడు ఎద్దులు చెరువులో పడి మృతిచెందాయి. వెదురుకుప్పం మండలం పాతగుంట గ్రామంలో ఆదివారం జల్లికట్టు వేడుకలు నిర్వహించారు. జల్లికట్టు చూసేందుకు సమీప గ్రామస్థులు పెద్ద ఎత్తున రావడం, డప్పు వాయిద్యాలకు జల్లికట్టులో బెదిరిన ఎద్దులు చెరువులో దూకడంతో మృతి చెందాయి. వ్యవసాయానికి ఉపయోగపడుతున్న ఎద్దులు మృతి చెందడంతో రైతులు విలపిస్తున్నారు.
News March 23, 2026
మీ BPని పెంచే ‘డేంజర్’ ఫుడ్స్ ఇవే!

హై BP గుండెపోటు, స్ట్రోక్కు దారితీస్తుంది. రోజూ తినే ప్రాసెస్డ్ మీట్, క్యాన్డ్ సూప్స్, వైట్ బ్రెడ్ వంటి వాటిలో సోడియం విపరీతంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి శరీరంలో నీటిని నిలిపి ఉంచి BPని పెంచుతాయి. అలాగే కెచప్, సోయా సాస్, ఫ్రోజెన్ పిజ్జాలు, కూల్ డ్రింక్స్లోని చక్కెర కూడా హాని చేస్తాయి. అందుకే ఉప్పు, చక్కెర తగ్గించి.. తాజా కూరగాయలు, తృణధాన్యాలు తీసుకుంటే BP కంట్రోల్లో ఉంటుంది.


