News August 23, 2025
ఐతుపెల్లి : హెల్త్ సెంటర్ను ప్రారంభించిన మంత్రి అడ్లూరి

పెగడపల్లి మండలం ఐతుపెల్లి గ్రామంలో ఈరోజు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నేషనల్ హెల్త్ మిషన్ కింద రూ. 20 లక్షల వ్యయంతో నిర్మించిన హెల్త్ సెంటర్ ను అధికారులతో కలిసి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. హెల్త్ సెంటర్ ద్వారా పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య అధికారులు, స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
Similar News
News March 24, 2026
ఈసీ లెటర్లో బీజేపీ ముద్ర.. విపక్షాల ఆగ్రహం

కేరళంలో ఎలక్షన్ కమిషన్ లెటర్లో <<19459684>>బీజేపీ సీల్<<>> ఉండటంపై కాంగ్రెస్, CPM తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. ‘ఇది పొరపాటు కాదు. తీవ్రమైన ప్రమాద సంకేతం. రాజ్యంగబద్ధ సంస్థ క్రెడిబిలిటీ, న్యూట్రాలిటీపై ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఎన్నికల సంఘం బీజేపీ తొత్తులా ఎందుకు ప్రవర్తిస్తోంది? దీనికి జవాబుదారీ ఎవరు?’ అని కాంగ్రెస్ Xలో ప్రశ్నించింది. బీజేపీ, EC రెండూ ఒకే ముద్రను ఉపయోగిస్తున్నాయని CPM ఫైరయ్యింది.
News March 24, 2026
WGL: అసెంబ్లీకి ఐదుగురు అతివలు!

పార్లమెంటులో 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లుకు మోక్షం లభించనుండటంతో వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయం కొత్త పుంతలు తొక్కనుంది. నియోజకవర్గాల పునర్విభజనతో పెరిగే 16 స్థానాల్లో కనీసం 4 నుంచి 5 స్థానాలు మహిళలకు కేటాయించే అవకాశం ఉంది. దీంతో కీలక స్థానాల్లో మహిళా నేతలు పోటీ చేసేందుకు సిద్ధమవుతుండగా, జిల్లా నుంచి ఐదుగురు మహిళా ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం కనిపిస్తోంది.
News March 24, 2026
టిబి ముక్త్ భారత్ అభియాన్ ద్వారా క్యాంపెయినింగ్

టిబి ముక్త్ భారత్ అభియాన్ ద్వారా ప్రత్యేక క్యాంపెయినింగ్ గతేడాది జూన్లో ప్రారంభించినట్లు HNK జిల్లా టీబీ కంట్రోల్ ఆఫీసర్ డాక్టర్ హిమబిందు తెలిపారు. ఇందులో భాగంగా 1.98,000 మంది హై రిస్క్ జనాభాలో 60 ఏళ్ల పైబడిన వారు డయాబెటిక్స్, ధూమపానం, మద్యపానం అలవాటు ఉన్నవారు, హెచ్ఐవీ బాధితులు, తదితర లక్షణాలను గుర్తించామన్నారు. 75,243 మందికి ఎక్స్ రే, 19,824 మందికి తెమడ పరీక్షలు చేశామన్నారు.
#ప్రపంచ క్షయ దినం.


