News August 23, 2025

సిరిసిల్ల: ‘విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసింది’

image

కేంద్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసిందని ఆర్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అంగూరు రంజిత్ అన్నారు. సిరిసిల్లలో శుక్రవారం రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. రంజిత్ మాట్లాడుతూ.. బడ్జెట్లో విద్యారంగానికి నిధులు కేటాయించకపోవడం వల్ల విద్య వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమై పేద విద్యార్థులకు అందని ద్రాక్షగా మారిందన్నారు. బీజేపీ విద్యా వ్యతిరేక విధానాలను మానుకోకపోతే మూల్యం చెల్లిస్తుందన్నారు.

Similar News

News August 23, 2025

GNT: జి.వి. కృష్ణారావు గొప్ప ఆల్రౌండర్

image

గవిని వెంకట కృష్ణరావు గుంటూరు జిల్లా కూచిపూడిలో 1914లో జన్మించారు. హేతువాది, ప్రముఖ రచయిత, దార్శనికులుగా, నవలా రచయితగా, కథా రచయితగా, వ్యాసకర్తగా, ప్రసార ప్రముఖునిగా, సంస్కృతాధ్యాపకుడుగా, తత్వవేత్తగా రాణించారు. ఆంధ్రప్రభలో సబ్‌ఎడిటర్‌గా, రాడికల్ డెమోక్రాట్,  విహారి, దేశాభిమాని, విజయప్రభ పత్రికలలో ఎడిటర్‌గా పనిచేశారు. స్టడీస్ ఇన్  కళాపూర్ణోదయంలో పీహెచ్డీ పొందారు. 1978 ఆగష్టు 23న మరణించారు.

News August 23, 2025

GNT: ఆయన సీఎంగా ఉన్నప్పుడే బ్యారేజ్ నిర్మాణం

image

ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారికి (1872 ఆగష్టు 23 – 1957 మే 20) గుంటూరుతో ప్రత్యేక అనుబంధం ఉంది. అప్పటి గుంటూరు జిల్లాలోని టంగుటూరిలో వారి కుటుంబం వంశపారంపర్యంగా గ్రామ కరణం వృత్తిలో ఉండేది. ఆయన సీఎంగా ఉన్నప్పుడు కృష్ణా నదిపై ప్రకాశం బారేజి నిర్మాణం, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం స్థాపన,2000 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రముఖమైనవి.

News August 23, 2025

ఐటీఐ వాక్-ఇన్ అడ్మిషన్లు ప్రారంభం

image

ప్రభుత్వ ఐటీఐలో వాక్-ఇన్ అడ్మిషన్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయని, దరఖాస్తు చేయడానికి ఆగస్టు 28 చివరి తేదీ అని భూపాలపల్లి ఐటీఐ ప్రిన్సిపల్ జుమ్లానాయక్ తెలిపారు. పదవ తరగతి పాస్ అయిన అభ్యర్థులు నేరుగా భూపాలపల్లిలోని ప్రభుత్వ ఐటీఐ/ఏటీసీ కేంద్రానికి తమ సర్టిఫికెట్లతో హాజరుకావొచ్చన్నారు. ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్, బీఈడీ పాస్ లేదా ఫెయిల్ అయిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.