News August 23, 2025
సిరిసిల్ల: ‘విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసింది’

కేంద్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసిందని ఆర్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అంగూరు రంజిత్ అన్నారు. సిరిసిల్లలో శుక్రవారం రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. రంజిత్ మాట్లాడుతూ.. బడ్జెట్లో విద్యారంగానికి నిధులు కేటాయించకపోవడం వల్ల విద్య వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమై పేద విద్యార్థులకు అందని ద్రాక్షగా మారిందన్నారు. బీజేపీ విద్యా వ్యతిరేక విధానాలను మానుకోకపోతే మూల్యం చెల్లిస్తుందన్నారు.
Similar News
News March 20, 2026
ఇండోర్ స్టేడియం పనుల్లో జాప్యం..!

బాలసముద్రంలోని డీఎస్ఏ ఇండోర్ స్టేడియం మరమ్మతు, సుందరీకరణ పనులు ఏడాదిగా నత్తనడకన సాగుతున్నాయి. రూ.68 లక్షలతో చేపట్టిన పనులు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపంతో ఆలస్యమవుతున్నాయి. దీంతో బ్యాడ్మింటన్ క్రీడాకారులు తాత్కాలికంగా ఇతర ప్రదేశాల్లో శిక్షణ తీసుకుంటూ ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
News March 20, 2026
NLG: వచ్చే నెల నుంచి ఒకేసారి 3 నెలల రేషన్ బియ్యం

వేసవి ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పేదలకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఏప్రిల్లో ఒకేసారి పంపిణీ చేయనుంది. NLG – 5,58,650, సూర్యాపేట – 3,55,057, యాదాద్రి-2,47,757 రేషన్ కార్డుదారులకు ఏప్రిల్ 1 నుంచి 30 వరకు ఈ పంపిణీ జరగనుంది. ఇప్పటికే
బియ్యం గోదాములకు చేరుకుంటున్నాయి.
News March 20, 2026
భారత్లో వరల్డ్ ఇండోర్ అథ్లెటిక్స్

వరల్డ్ ఇండోర్ అథ్లెటిక్స్-2028 నిర్వహణకు భారత్కు ఆతిథ్య హక్కులు దక్కాయి. ఈవెంట్ నిర్వహించేందుకు భారత్, న్యూజిలాండ్ పోటీ పడ్డాయి. మౌలిక వసతుల పరిశీలన అనంతరం ఒడిశాలోని భువనేశ్వర్లో ఈవెంట్ నిర్వహణకు అనుమతి వచ్చింది. దీంతో ఆసియాలో జపాన్, ఖతర్, చైనా తర్వాత ఈ పోటీలకు ఆతిథ్యం ఇవ్వనున్న నాలుగో దేశంగా భారత్ నిలవనుంది. ఇక వరల్డ్ ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్-2026 పోలాండ్ వేదికగా నేడు ప్రారంభం కానుంది.


