News April 2, 2024
పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత కట్టుదిట్టం: డీజీపీ

సార్వత్రిక ఎన్నికలు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ కె.వి.రాజేంద్రనాథ్ రెడ్డి ఎన్నికల దృష్ట్యా శాంతి భద్రతల పరిరక్షణ, సమాచారం సేకరణ వంటి అంశాలపై సోమవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ లో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో జిల్లా నుంచి ఎస్పీ జీ.ఆర్ రాధిక, ఏఎస్పీ ప్రేమ్ కాజల్ పాల్గొన్నారు. అనంతరం ఏపీ డీజీపీ జిల్లాలోని పోలింగ్ వద్ద భద్రత వంటి పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు.
Similar News
News March 21, 2026
అరసవల్లి ఇంద్రపుష్కరిణి నమూనా చిత్రం ఇదే

అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం ఇంద్రపుష్కరిణి నమూనా చిత్రాన్ని శనివారం అధికారులు విడుదల చేశారు. ఇంద్రపుష్కరిణి అభివృద్ధికి రూ.4కోట్ల వ్యయంతో పనులు ప్రారంభించిన విషయం విదితమే. ఈ మేరకు పుష్కరిణి నమూనా చిత్రాన్ని విడుదల చేశారు. కాగా భక్తుల సౌకర్యార్థం ఇప్పటికే ఆలయంలో పలు మార్పులకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.
News March 21, 2026
గ్లోబల్ డెస్టినేషన్గా ఉత్తరాంధ్ర : రామ్మోహన్

విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏపీ తన బలాన్ని ప్రపంచానికి చూపిస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శనివారం విశాఖ నోవాటెల్ హోటల్ లో సీఐఐ ఆధ్వర్యంలో జరిగిన స్వర్ణాంధ్ర ప్రదేశ్ కాన్ఫ్రెన్స్కు కేంద్రమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉత్తరాంధ్ర గ్లోబల్ డెష్టినేషన్గా రూపుదిద్దుకొంటోందని అన్నారు.
News March 21, 2026
సంతబొమ్మాళి: ‘వేసవి తాపాన్ని తట్టుకొనే విత్తనగుళికలు శ్రేష్టం’

వేసవితాపన్ని తట్టుకొని సజీవంగా పంట ఉండాలంటే విత్తనాలను విత్తనగుళికలు తయారు చేసుకోవటం శ్రేష్టమని శ్రీకాకుళం జిల్లా అడిషనల్ DPM ధనుంజయ్ అన్నారు. శనివారం సంతబొమ్మాళి మండలం కే.జి వలసలో రైతులు పొలాల్లో చేసే ప్రక్రియను పరిశీలించారు. ఈ విత్తనాలు జల్లుకోవడం ద్వారా వాతావరణంలో ఉండే తేమని గ్రహించి మొలకలువచ్చి పంట ఏపుగా పెరుగుతుందన్నారు. బీజామృతం, ఘణజీవామృతం, బంకమట్టి, బూడిదలో విత్తనాలు కలపాలన్నారు.


