News April 2, 2024

పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత కట్టుదిట్టం: డీజీపీ

image

సార్వత్రిక ఎన్నికలు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ కె.వి.రాజేంద్రనాథ్ రెడ్డి ఎన్నికల దృష్ట్యా శాంతి భద్రతల పరిరక్షణ, సమాచారం సేకరణ వంటి అంశాలపై సోమవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ లో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో జిల్లా నుంచి ఎస్పీ జీ.ఆర్ రాధిక, ఏఎస్పీ ప్రేమ్ కాజల్ పాల్గొన్నారు. అనంతరం ఏపీ డీజీపీ జిల్లాలోని పోలింగ్ వద్ద భద్రత వంటి పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు.

Similar News

News April 22, 2025

శ్రీకూర్మం: పుణ్యక్షేత్రంలో.. పాపం చేసింది ఎవరు..?

image

శ్రీకూర్మం గ్రామంలోని శ్రీ కూర్మనాధుని క్షేత్రంలో తాబేళ్లు మృతిచెందిన ఘటన సోమవారం జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. తాబేళ్లను ఆలయ శ్వేతపుష్కరని సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు కాల్చివేయడం ప్రజలను విస్మయానికి గురిచేసింది. పుణ్యక్షేత్రంలో పాపం చేసింది ఎవరు? తాబేళ్లు మృతిపై ఆలయ సిబ్బంది ఎందుకు గోప్యంగా ఉంచారు? దీని వెనుక కారణాలు ఏంటి.. కారకులు ఎవరు అనే ప్రశ్నలకు సమాధానాలు దొరకాల్సి ఉంది.

News April 22, 2025

నేడు జిల్లాకు జలవనరుల శాఖ మంత్రి పర్యటన

image

రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మంగళవారం జిల్లాలో పర్యటించనున్నారు. విజయనగరం నుంచి మధ్యాహ్నం 1:30 కు రోడ్డు మార్గంలో బయలుదేరి 3:30 గంటలకు టెక్కలి చేరుకుంటారు. వంశధార ఎడమ ప్రధాన కాలువను పరిశీలిస్తారు. సాయంత్రం 5:30 కు శ్రీకాకుళం కలెక్టరేట్ చేరుకుంటారు. 6:30 గంటల వరకు అధికారులతో కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహిస్తారు. రాత్రి 7గంటలకు విశాఖపట్నం బయలు దేరుతారు. 

News April 22, 2025

శ్రీకాకుళం: ఎస్పీ గ్రీవెన్స్‌కు 79 వినతలు

image

ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమానికి వచ్చే వినతులు పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఏఎస్పీ కెవి రమణ పేర్కొన్నారు. శ్రీకాకుళంలోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం జరిగింది. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు అర్జీలు అందజేశారు. తన దృష్టికి వచ్చిన ఫిర్యాదులపై సంబంధిత అధికారుల నుంచి వివరణ తీసుకున్నారు. మొత్తం 79 అర్జీలు వచ్చినట్లు చెప్పారు.

error: Content is protected !!