News April 2, 2024

తిరుపతి: వడగాల్పులపై హెచ్చరికలు జారీ చేయండి

image

వడగాల్పులపై ప్రజలకు ముందుగానే తగిన హెచ్చరికలు జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి తెలిపారు. సోమవారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఎండ వేడిమి, వడగాల్పులు అధికం అవుతున్న నేపధ్యంలో తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని విపత్తు నిర్వహణ సంస్థ అధికారులను, జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

Similar News

News October 1, 2025

CM చంద్రబాబుపై బాంబు దాడి.. నేటికి 22 ఏళ్లు.!

image

అది అక్టోబర్ 1వ తేదీ 2003. తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు చంద్రబాబు CM హోదాలో తిరుమలకు వస్తున్నారు. సరిగ్గా అలిపిరి తనిఖీ కేంద్రం వద్దకు రాగానే ఒక్కసారిగా బాంబు శబ్దం. అందరూ తేరుకునేలోపే CM ఉన్న కారు గాల్లోకి ఎగిరి పడగా చంద్రబాబు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనకు నేటితో 22 ఏళ్లు. శ్రీవారి దయతోనే తాను ప్రాణాలతో బయటపడినట్లు పలు సందర్భాల్లో CM వ్యాఖ్యానించారు.

News September 30, 2025

NCD ఏర్పాటుకు చర్యలు: చిత్తూరు కలెక్టక్

image

పీహెచ్సీల్లో ఎన్సీడీ (నాన్ కమ్యూనికబుల్ డిసీజన్) సెల్ ఏర్పాటు చేస్తామని, దీనికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ టీం సహకరించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ కోరారు. కలెక్టరేట్‌లో ఎన్సీడీపై జిల్లాలో విస్తృతంగా పర్యటించిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఢిల్లీ) బృందం కలెక్టర్‌తో సమావేశమైంది. ప్రజా ఆరోగ్యం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

News September 30, 2025

సెలవుపై వెళ్లిన చిత్తూరు DRO

image

జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) మోహన్ కుమార్ వ్యక్తిగత పనుల నిమిత్తం సెలవు పెట్టారు. అక్టోబర్ 2 వరకు ఆయన సెలవుపై ఉండటంతో ఇన్‌ఛార్జ్ బాధ్యతలను డిప్యూటీ కలెక్టర్ కేడర్ అధికారికి అప్పగించారు. కలెక్టరేట్‌లో ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న డిప్యూటీ కలెక్టర్ కుసుమకుమారికి ఇన్‌ఛార్జ్ డీఆర్వోగా బాధ్యతలప్పగిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.