News August 23, 2025

తాడేపల్లిలో కాకాణితో ఎమ్మెల్సీ పర్వత్ రెడ్డి భేటీ

image

తాడేపల్లిలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా పలు విషయాలు చంద్రశేఖర్ రెడ్డి చర్చించారు. జిల్లాలోని తాజా రాజకీయ పరిస్థితుల గురించి వివరించి, ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై భవిష్యత్తులో చేయాల్సిన పోరాటాలపై మాట్లాడుకున్నారు.

Similar News

News April 11, 2026

VSUలో ఒకేసారి 3 స్నాతకోత్సవాలు

image

విక్రమసింహపురి యూనివర్సిటీ(VSU) 10, 11, 12వ స్నాతకోత్సవాలు మే, లేదా జూన్‌లో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు స్నాతకోత్సవాలు ఒకేసారి నిర్వహించనున్నారు. తేదీలను త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. 2022-23, 23-24, 24-25 రెగ్యులర్ యూజీ, పీజీ, ప్రొఫెషనల్ కోర్సులు పూర్తి చేసిన వారు, గతేడాది డిసెంబర్ 31 నాటికి పీహెచ్ విజయవంతంగా పూర్తి చేసిన వారు రావాలని కోరారు.

News April 11, 2026

నెల్లూరు కలెక్టర్‌కు సీఎం ప్రశంసలు

image

నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లాకు మరోసారి సీఎం చంద్రబాబు నుంచి ప్రశంసలు లభించాయి. పట్టాదారు పాస్ పుస్తకాలు ఏడాదిలోపు పంపిణీ చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈక్రమంలో కలెక్టర్ ‘వన్ మంత్ వన్ విలేజ్ ఫోర్ విజిట్స్’కు శ్రీకారం చుట్టారు. అధికారులను నెలలో నాలుగు సార్లు గ్రామానికి పంపి ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నారు. ఇదే విధానాన్ని అందరూ అనుసరించాలని సీఎం ఇతర కలెక్టర్లకు సూచించారు.

News April 11, 2026

నెల్లూరు జిల్లాలో పరిశ్రమలకు గ్రీన్ సిగ్నల్

image

నెల్లూరు జిల్లాలో కొత్తగా రెండు పరిశ్రమల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దుత్తలూరు మండలం పాపంపల్లెలో డిఫెన్స్ రా మెటీరియల్ తయారీ యూనిట్ కోసం 349.95 ఎకరాలు కేటాయించడానికి ఓకే చెప్పింది. ఇక్కడ రూ.1000కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు. అలాగే మనుబోలు మండలం మడమనూరు వద్ద 250 ఎకరాల్లో రూ.3500 కోట్లతో స్టీల్ పరిశ్రమ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక్కడ 3వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి.