News August 23, 2025

టీడీపీ నేత పొలంలో క్షుద్ర పూజల కలకలం

image

పెద్దకడబూరు మండలం జాలవాడికి చెందిన టీడీపీ గ్రామ అధ్యక్షుడు ముక్కన్న పత్తి పొలంలో గుర్తుతెలియని వ్యక్తులు శుక్రవారం క్షుద్ర పూజలు చేశారు. ఈ ఘటన గ్రామంలో కలకలం రేపుతుంది. మూడు నెలల క్రితం ముక్కన్న ఇంటి ముందు క్షుద్ర పూజలు చేసిన దుండగులే ఇప్పుడూ పత్తి పొలంలో చేసినట్లు అనుమానిస్తున్నారు. దీనిపై ముక్కన్న స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విచారణ చేసి చర్యలు తీసుకుంటామని ఎస్సై తెలిపారు.

Similar News

News March 18, 2026

ఏలూరు ఇఫ్తార్ విందులో కలెక్టర్

image

సర్వ మానవాళి సుఖసంతోషాల కోసం ప్రార్థించడమే రంజాన్ ముఖ్యోద్దేశమని కలెక్టర్ వెట్రిసెల్వి పేర్కొన్నారు. స్థానిక గిరిజన భవన్‌లో మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఆమె పాల్గొన్నారు. రంజాన్ ఉపవాస దీక్షలు ఓర్పు, సహనం, సత్ప్రవర్తనను అలవరుస్తాయని కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు. మేయర్ నూర్జహాన్, ఎమ్మెల్యే బడేటి చంటి తదితరులు పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.

News March 18, 2026

కడప: పిడుగు పడి ఒకరి మృతి

image

కడప జిల్లా కాశినాయన మండలం చిన్నాయపల్లిలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన నారాయణరెడ్డి(60) బుధవారం పొలం వద్దకు వెళ్లాడు. సాయంత్రం తిరిగి వస్తున్న సమయంలో వర్షంతో పాటు పిడుగు పడింది. ఈక్రమంలో ఆయన చనిపోయారు. కుటుంబ పెద్ద కన్నుమూయడంతో బంధువులు బోరున విలపించారు.

News March 18, 2026

నల్గొండ: మత సామరస్యానికి ప్రతీక రంజాన్: కలెక్టర్

image

రంజాన్ పర్వదినాన్ని సోదరభావంతో జరుపుకోవాలని కలెక్టర్ చంద్రశేఖర్ ఆకాంక్షించారు. బుధవారం స్టార్ ఫంక్షన్ హాల్‌లో ప్రభుత్వ ‘దావత్-ఏ-ఇఫ్తార్’లో ఆయన పాల్గొన్నారు. జిల్లాలో 5,250 మంది పేద ముస్లింలకు ప్రభుత్వం రంజాన్ తోఫా అందజేస్తోందని తెలిపారు. మైనార్టీల సామాజిక, ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, అధికారులు పాల్గొన్నారు.