News August 23, 2025
SA టీ20 లీగ్కు 13 మంది భారత ఆటగాళ్లు

వచ్చే నెల 9 నుంచి ప్రారంభం కానున్న SA టీ20 లీగ్లో 13 మంది భారత ఆటగాళ్లు బరిలోకి దిగే అవకాశం ఉంది. పీయూష్ చావ్లా, సిద్ధార్థ్ కౌల్, అంకిత్ రాజ్పుత్, వెంకటేశ్ గాలిపెల్లి, మహేశ్ అహిర్, సరుల్ కన్వర్, అనురీత్ సింగ్ కతూరియా, నిఖిల్ జగా, కేఎస్ నవీన్, ఇమ్రాన్ ఖాన్, అతుల్ యాదవ్, అన్సారీ మరూఫ్, మహమ్మద్ ఫైద్ వేలానికి తమ పేర్లు నమోదు చేసుకున్నారు. పీయూష్ తప్ప, మిగతా వారందరి బేస్ ప్రైజ్ రూ.10 లక్షలుగా ఉంది.
Similar News
News August 23, 2025
మేజరైన యువతి కోరుకున్న వ్యక్తితో జీవించొచ్చు: హైకోర్టు

పెళ్లి కాని యువతి వివాహితుడితో కలిసి జీవించొద్దని చట్టంలో ఎక్కడా లేదని MP హైకోర్టు తెలిపింది. పురుషుడి భార్యకు తప్ప మరెవరికీ ఆమెపై ఫిర్యాదు చేసే హక్కు ఉండదని స్పష్టం చేసింది. మేజరైన యువతికి నచ్చినవారితో జీవించే హక్కు ఉంటుందని పేర్కొంది. తమ కుమార్తె ఓ పెళ్లైన వ్యక్తితో వెళ్లిపోయిందని ఆమె పేరెంట్స్ కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయగా పైవిధంగా తీర్పునిచ్చింది.
News August 23, 2025
HYD రావాలని OpenAIకి KTR విజ్ఞప్తి

ఇండియాలో ఆఫీస్ ఓపెన్ చేస్తామని ప్రకటించిన ప్రముఖ AI సంస్థ OpenAIని HYDకు రావాలని మాజీ మంత్రి KTR కోరారు. ‘హైదరాబాద్ అనువైన ప్రాంతం. ఇక్కడ THub, WEHub, TWorks, తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ సహా ఎన్నో ఉన్నాయి. MNCలు మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, మెటా, ఆపిల్, క్వాల్కమ్కు కేంద్రంగా ఉంది. AI విప్లవానికి శక్తినిచ్చే ప్రతిభ, ఆవిష్కరణలు, గ్లోబల్ కనెక్టివిటీని HYD తీసుకొస్తుంది’ అని Xలో పోస్ట్ చేశారు.
News August 23, 2025
CHECK NOW.. మీకు కొత్త రేషన్ కార్డు వచ్చిందా?

AP: ఈ నెల 25 నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కొత్తగా 6.71 లక్షల మందితో కలిపి మొత్తం 1.45 కోట్ల అర్హుల కుటుంబాలకు ప్రభుత్వం స్మార్ట్ కార్డులు ఇవ్వనుంది. రేషన్ కార్డు కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారు తమ దరఖాస్తుకు ఆమోదం వచ్చిందో లేదో ఇక్కడ <