News August 23, 2025
పార్వతీపురం: ఎరువుల బ్లాక్ మార్కెటింగ్పై ప్రత్యేక నిఘా

పార్వతీపురం మన్యం జిల్లాలో యూరియా, ఎరువుల బ్లాక్ మార్కెటింగ్ అరికట్టేందుకు ప్రత్యేక నిఘాతో దాడులు నిర్వహిస్తున్నామని ప్రాంతీయ ఎన్ఫోర్స్మెంట్ అధికారి బర్ల ప్రసాదరావు శుక్రవారం ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా గోదాములు, హోల్సేల్ డీలర్లు, రిటైల్ షాపులపై విజిలెన్స్ తనిఖీలు చేస్తున్నాయన్నారు. రైతులకు అవసరమైన ఎరువులు పంపిణీలో డీలర్లు అక్రమ చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
Similar News
News March 20, 2026
నల్గొండ: ఇరుకైన బ్రిడ్జిలు.. ఘోర ప్రమాదాలు

కోదాడ-జడ్చర్ల, నల్గొండ-మాచర్ల హైవేలపై ఇరుకైన వంతెనలు, రక్షణ గోడలు లేకపోవడంతో ఘోర ప్రమాదాలు జరుగుతున్నాయి. గత నెల హాలియా సమీపంలో జరిగిన లారీ ప్రమాదంలో కొత్తగూడెం దంపతులు మృతి చెందగా, కంపాసాగర్ వద్ద కారు కాల్వలో పడి మరో దంపతులు ప్రాణాలు కోల్పోయారు. ఈ వరుస ఘటనలు ప్రయాణికులను వణికిస్తున్నాయి. అధికారులు స్పందించి వంతెనలకు రక్షణ గోడలు నిర్మించి, ప్రమాదాలను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.
News March 20, 2026
ఒక్క రోజే రూ.5,000 తగ్గిన వెండి ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఓ వైపు <<19430821>>బంగారం<<>> ధరలు పెరగ్గా వెండి ధరలు తగ్గాయి. కేజీ సిల్వర్పై రూ.5వేలు తగ్గి రూ.2,60,000 పలుకుతోంది. నిన్న కూడా కేజీపై రూ.10,000 తగ్గిన విషయం తెలిసిందే. మొత్తంగా 3 రోజుల్లో కేజీపై రూ.20,000 తగ్గడం గమనార్హం.
News March 20, 2026
గ్యాస్ కొరత లేదు.. ఆందోళన వద్దు: కలెక్టర్

జిల్లాలో ప్రజల అవసరాలకు సరిపడా గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ అభిలాష అభినవ్ స్పష్టం చేశారు. సరఫరాపై ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. బుక్ చేసుకున్న నిర్ణీత గడువులోనే సిలిండర్లు నేరుగా ఇంటికే అందుతాయని, ఏజెన్సీల వద్దకు వెళ్లాల్సిన పని లేదని పేర్కొన్నారు. ఎక్కడా కొరత లేకుండా పకడ్బందీగా పంపిణీ జరుగుతుందని కలెక్టర్ వివరించారు.


