News August 23, 2025

10,834 ఎకరాల్లో కృష్ణపట్నం కారిడార్

image

AP: చెన్నై-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్‌లో భాగంగా నిర్మించే కృష్ణపట్నం నోడ్‌ను 10,834 ఎకరాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు మాస్టర్ ప్లాన్‌ను ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ భూమిని 3 దశల్లో వివిధ అవసరాలకు వినియోగించేలా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. 44.3% భూమిని పారిశ్రామిక అవసరాలకు, 13.8శాతం భూములను రోడ్ల నిర్మాణానికి, 11.1శాతం భూమిని పచ్చదనం అభివృద్ధికి ఉపయోగించనున్నారు.

Similar News

News August 23, 2025

రానున్న 2 గంటల్లో వర్షం!

image

TG: హైదరాబాద్‌లో రానున్న 2 గంటల్లో తేలికపాటి వర్షం పడుతుందని HYD వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ముఖ్యంగా GHMCలోని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే ఛాన్స్ ఉన్నట్లు వెల్లడించింది. మరోవైపు నార్త్, ఈస్ట్ తెలంగాణలోని పలు జిల్లాల్లో సాయంత్రం నుంచి రాత్రి వరకు వాన పడొచ్చని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.

News August 23, 2025

త్వరలో నేతన్నలకు రూ.25 వేలు: చంద్రబాబు

image

AP: ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి రెండూ అందిస్తున్నట్లు CM చంద్రబాబు పేర్కొన్నారు. ’48 లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీభవ డబ్బులు వేశాం. అందరు నేతన్నలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. త్వరలోనే నేతన్న భరోసా కింద ఒక్కో కుటుంబానికి రూ.25 వేలు ఇవ్వబోతున్నాం. అదేరోజు సెలూన్లకు ఉచిత విద్యుత్ పథకాన్ని కూడా ప్రారంభించబోతున్నాం. 40 వేల సెలూన్లకు 200 యూనిట్ల చొప్పున ఉచిత విద్యుత్ అందించబోతున్నాం’ అని తెలిపారు.

News August 23, 2025

బెట్టింగ్ కేసులో కాంగ్రెస్ MLA అరెస్ట్

image

బెట్టింగ్‌ కేసులో కర్ణాటక(చిత్రదుర్గ) కాంగ్రెస్ MLA వీరేంద్ర‌ను ED అరెస్ట్ చేసింది. ఈయన సిక్కింలోని గ్యాంగ్‌టక్‌లో క్యాసినో నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. రూ.12కోట్ల నగదు, రూ.6కోట్ల బంగారు ఆభరణాలు సీజ్ చేశారు. ఈయన సోదరుడు, సన్నిహితులు బెట్టింగ్ యాప్‌లు నిర్వహిస్తున్నట్లు గుర్తించి వారి బ్యాంక్ ఖాతాలు సీజ్ చేశారు. ఆన్లైన్ గేమింగ్ యాక్ట్ అమల్లోకి వచ్చిన కొద్దిగంటల్లోనే అరెస్ట్ చేయడం గమనార్హం.