News August 23, 2025

నూజివీడు: అక్రమ సారా తయారీపై డ్రోన్ నిఘా

image

అక్రమ నాటు సారా తయారీ, ఇతర అసాంఘిక కార్యకలాపాలపై ఏలూరు జిల్లా పోలీసులు డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టారు. నూజివీడు, జంగంగూడెం అటవీ ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా పరిశీలన జరిపినట్లు రూరల్ ఎస్.ఐ. జ్యోతిబసు తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలను గమనిస్తే వెంటనే ‘112’కు కాల్ చేయాలని ప్రజలకు పోలీసులు సూచించారు. సమాజంలో శాంతి భద్రతల కోసం పోలీసులు ఈ చర్యలు చేపట్టారు.

Similar News

News March 13, 2026

పొద్దుటూరులో నేటి బంగారు వెండి ధరల వివరాలు ఇలా.!

image

పొద్దుటూరు బులియన్ మార్కెట్లో శుక్రవారం బంగారు, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
*24 క్యారెట్ బంగారం 1గ్రాము ధర రూ.15,780
*22 క్యారెట్ బంగారం 1గ్రాము ధర రూ.14,518
*వెండి 10 గ్రాముల ధర రూ.2,665

News March 13, 2026

రాష్ట్రాలకు శుభవార్త.. భారీగా నిధులు

image

AP సహా 6 రాష్ట్రాలు/UTకి ₹1,913Cr అదనపు నిధుల విడుదలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆమోదం తెలిపారు. 2025లో వరదలు, మొంథా తుఫాను నష్టానికి సాయంగా ఈ మొత్తాన్ని చెల్లిస్తారు. గుజరాత్‌కు ₹778Cr, APకి ₹341Cr, J&Kకు ₹330Cr, HPకి ₹288Cr, నాగాలాండ్‌కు ₹158Cr, ఛత్తీస్‌గఢ్‌కు ₹15Cr అందనున్నాయి. FY26లో SDRF కింద 28 రాష్ట్రాలకు ₹20,735Cr, NDRF కింద 21 రాష్ట్రాలకు ₹3,628Cr రిలీజ్ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.

News March 13, 2026

విజయవాడలో ప్రమాదం.. MBBS విద్యార్థి దుర్మరణం

image

రోడ్డు ప్రమాదంలో సిద్ధార్థ మెడికల్ కళాశాల విద్యార్థి లిఖిత్ సాయి (MBBS) దుర్మరణం చెందారు. శ్రీకాళహస్తికి చెందిన ఆయన గురువారం రాత్రి రామవరప్పాడు నుంచి వస్తుండగా, పరిణయ కళ్యాణ మండపం వద్ద బైక్ అదుపుతప్పి పడిపోయారు. తలకు తీవ్ర గాయమవ్వడంతో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు. హెల్మెట్ ధరించి ఉంటే ప్రాణం నిలిచేదని స్థానికులు చెబుతున్నారు. పటమట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.