News August 23, 2025

తాడ్వాయి: కనుమరుగైన మంచెలు

image

వ్యవసాయ బావుల వద్ద మంచెలు కనుమరుగయ్యాయి. గత 20 ఏళ్ల క్రితం వ్యవసాయ బావుల వద్ద రైతులు కట్టెలతో మంచెలు వేసుకొని సాగుచేసిన పంటలకు కాపలా కాసేవారు. అంతేకాకుండా క్రిమి కీటకాల నుంచి రక్షణగా మంచెలు ఉండేవి. కాపలా అనంతరం మంచెపై కూర్చుని భోజనం చేసి రైతులు సేద తీరేవారు. అలాంటి స్వేచ్ఛ ఇప్పుడు రైతులకు వ్యవసాయ బావుల వద్ద లేకుండా పోయింది. మంచెల గురించి పలువురు రైతులు గుర్తు చేసుకుని చర్చించుకుంటున్నారు.

Similar News

News August 23, 2025

HYD: ట్రాన్స్‌జెండర్ ఐడీ కార్డుల కోసం ప్రత్యేక శిబిరం

image

తెలంగాణలోని ట్రాన్స్‌జెండర్లకు ఐడీ కార్డులు, ఆధార్ కార్డుల సవరణలకు ఒక ప్రత్యేక శిబిరం ఆగస్టు 26న హైదరాబాద్‌లోని దివ్యాంగులు, వయో వృద్ధులు, ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల సాధికారత శాఖ కార్యాలయంలో నిర్వహించనున్నారు. ఈ శిబిరం ఉదయం 10:30 నుంచి సా.5:30 గంటల వరకు ఉంటుందని ఆ శాఖ డైరెక్టర్ బి.శైలజ ఈరోజు తెలిపారు. ఈ అవకాశాన్ని ట్రాన్స్‌జెండర్లు వినియోగించుకోవాలని కోరారు.

News August 23, 2025

HYD: ట్రాన్స్‌జెండర్ ఐడీ కార్డుల కోసం ప్రత్యేక శిబిరం

image

తెలంగాణలోని ట్రాన్స్‌జెండర్లకు ఐడీ కార్డులు, ఆధార్ కార్డుల సవరణలకు ఒక ప్రత్యేక శిబిరం ఆగస్టు 26న హైదరాబాద్‌లోని దివ్యాంగులు, వయో వృద్ధులు, ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల సాధికారత శాఖ కార్యాలయంలో నిర్వహించనున్నారు. ఈ శిబిరం ఉదయం 10:30 నుంచి సా.5:30 గంటల వరకు ఉంటుందని ఆ శాఖ డైరెక్టర్ బి.శైలజ ఈరోజు తెలిపారు. ఈ అవకాశాన్ని ట్రాన్స్‌జెండర్లు వినియోగించుకోవాలని కోరారు.

News August 23, 2025

వెల్గటూర్: ఉరివేసుకుని వృద్ధుడి ఆత్మహత్య

image

జీవితంపై విరక్తి చెంది టేకు చెట్టుకు వృద్ధుడు ఉరివేసుకొని మృతిచెందిన ఘటన వెల్గటూర్ మండలం కొండాపూర్‌లో జరిగింది. SI ఉమాసాగర్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఇప్పల రాజయ్య (61) గత సంవత్సరం నుండి హైబీపీ, కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. మందులు వాడుతున్నా తగ్గకపోవడంతో శనివారం ఉదయం తన పొలం వద్ద ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.