News August 23, 2025
అనిల్ అంబానీ నివాసాల్లో సీబీఐ సోదాలు

ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ ముంబైలోని నివాసాలు, కార్యాలయాల్లో సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. బ్యాంకులకు రూ.వేల కోట్ల రుణం ఎగ్గొట్టారనే ఆరోపణలతో ఆర్.కామ్, అంబానీతో సంబంధం ఉన్న చోట్ల సోదాలు చేస్తోంది. ఇటీవల ఈడీ కూడా ఆయన కార్యాలయాల్లో సోదాలు నిర్వహించి, ఆ తర్వాత విచారించిన సంగతి తెలిసిందే.
Similar News
News March 21, 2026
నేడు, రేపు వర్షాలు: APSDMA

AP: బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో నేడు, రేపు వానలు పడతాయని APSDMA తెలిపింది. ఇవాళ రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. రేపు విజయనగరం, VZG, అనకాపల్లి, కృష్ణా, NTR, గుంటూరు, బాపట్ల, ATP, సత్యసాయి జిల్లాల్లో వానలు పడతాయని హెచ్చరించింది. రైతులు వ్యవసాయ పనుల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
News March 21, 2026
గ్యాస్ బుకింగ్స్ తగ్గాయి: కేంద్రం

దేశవ్యాప్తంగా పానిక్ బుకింగ్స్ తగ్గాయని కేంద్రం తెలిపింది. అవసరమైనంత మేర నిల్వలు ఉన్నాయని చెప్పింది. ‘గ్యాస్ బుకింగ్స్ 89 లక్షల నుంచి 55 లక్షలకు తగ్గాయి. బ్లాక్ మార్కెటింగ్ను అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నాం. 24 గంటల్లో 4 వేల సిలిండర్లను స్వాధీనం చేసుకున్నాం. కొత్తగా 13,700 PNG కనెక్షన్లు జారీ చేశాం. ప్రజలు PNG, ఎలక్ట్రిక్/ఇండక్షన్ స్టవ్స్ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలకు మళ్లాలి’ అని సూచించింది.
News March 21, 2026
8 గంటల ప్రయాణం తర్వాత విమానం యూటర్న్!

ఢిల్లీ నుంచి వాంకోవర్(కెనడా)కు బయల్దేరిన ఎయిరిండియా విమానం ప్రయాణికులకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. 8Hr ప్రయాణం తర్వాత తిరిగి ఢిల్లీలోనే ల్యాండైంది. కెనడాలో ఆ ఫ్లైట్కు పర్మిషన్ లేకపోవడమే ఇందుకు కారణం. ఎయిరిండియాకు చెందిన బోయింగ్ 777-300ER విమానాలకు కెనడాలో అనుమతి ఉండగా, 777-200LRను పంపింది. చైనా గగనతలంలోకి వెళ్లాక తెలియడంతో అధికారులు వెనక్కి రప్పించారు. తర్వాత వేరే విమానంలో ప్రయాణికులను పంపారు.


