News August 23, 2025
రథం గుట్టను పరిశీలించిన జిప్ లైన్ అడ్వెంచర్ బృందం

మణుగూరు గుట్ట మల్లారం వద్ద గల రథం గుట్ట ప్రాంతాన్ని జిప్ లైన్ అడ్వెంచర్ బృందం శుక్రవారం పరిశీలించింది. భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశాల మేరకు ఈ ప్రాంతం పర్యాటక కేంద్రంగా మార్చుటకు పరిశీలనకు వచ్చామని బృందం సభ్యులు తెలియజేశారు. మణుగూరు రథం గుట్టను పరిశీలించిన జిప్ లైన్ అడ్వెంచర్ బృందం పూర్తిస్థాయిలో పరిశీలన చేసి నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని పేర్కొన్నారు.
Similar News
News August 23, 2025
గుంటూరు జిల్లా TODAY TOP NEWS

☞ గుంటూరులో అబ్బురపరుస్తున్న 99 అడుగుల మట్టి గణపతి.
☞ వినాయక ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి: SP.
☞ హత్యకు గురైన ఈ తీర్పు మా బిడ్డకు ఘనమైన నివాళి.
☞ మొదటి ఐదు ర్యాంకుల్లో జిల్లా మంత్రులు.
☞ తెనాలి: నిందితుడిని పట్టించిన సీసీ కెమెరా.
☞ రాష్ట్ర స్థాయి పోటీలకు మందడం విద్యార్థి.
☞ మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించిన పెమ్మసాని.
News August 23, 2025
అఖిల్ ఒక్క రూపాయి తీసుకోలేదు: అనిల్ సుంకర

తనకు కష్టం వస్తే తాను వర్క్ చేసిన హీరోలంతా సపోర్ట్గా నిలుస్తారని నిర్మాత అనిల్ సుంకర తెలిపారు. మూవీస్ ఆడకపోతే తన హీరోలు ఎంతో మద్దతుగా నిలుస్తారని చెప్పుకొచ్చారు. భోళా శంకర్ మూవీ విషయంలో చిరంజీవి చాలా సహాయం చేశారని చెప్పారు. అలాగే, ఏజెంట్ మూవీకి అఖిల్ ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోలేదని వెల్లడించారు. 2023లో 4 నెలల గ్యాప్లో విడుదలైన ఈ 2 చిత్రాలు ఆశించిన ఫలితాలను అందుకోలేదు.
News August 23, 2025
FLASH: HYD: లింగంపల్లిలో ట్రావెల్ బస్ బ్రేక్ ఫెయిల్

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి ట్రిపుల్ ఐటీ వెళ్లే మార్గంలో ఈరోజు రోడ్డు ప్రమాదం జరిగింది. మజీద్ బండ జంక్షన్ వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు బ్రేక్ ఫెయిల్ కావడంతో అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఏం జరగలేదని, అయితే కాస్త ట్రాఫిక్ జామవగా పోలీసులు వచ్చి క్లియర్ చేశారన్నారు. డ్రైవర్ చాకచక్యంతో బస్సును నడపడంతో పెను ప్రమాదం తప్పింది.